News March 20, 2024

NZB: ‘హై కోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు’

image

నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో ఆయన వేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీవోకు అందజేశారు. ఈ నెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు.

Similar News

News February 24, 2025

నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్ 

image

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్‌లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.

News February 24, 2025

NZB: BRSకు పోటీ చేసేందుకు అభ్యర్థి లేడు: CM

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్‌కు అభ్యర్థి దొరకలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటూ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కనీసం ఎన్నికల్లో పోటీకి అభ్యర్థి లేని ఆ పార్టీ తమ ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడుతుందో ఆలోచించుకోవాలన్నారు.

News February 24, 2025

NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు, పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయని వెల్లడించారు.

error: Content is protected !!