News July 22, 2024

ఇద్దరు MLAల ప్రమాణం చట్టవిరుద్ధం.. చెరో ₹500 ఫైన్: WB రాజ్‌భవన్

image

పశ్చిమబెంగాల్‌లో TMC ఎమ్మెల్యేలు రేయాత్ హుసేన్, సయంతికా బెనర్జీ ప్రమాణస్వీకారంపై గందరగోళం నెలకొంది. వారితో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని రాజ్‌భవన్ పేర్కొంది. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ వారికి రూ.500 చొప్పున జరిమానా చెల్లించాలని తెలిపింది. ఈ విషయమై ఎమ్మెల్యేలు స్పీకర్‌ను ఆశ్రయించారు. కాగా ఉపఎన్నికల్లో గెలిచిన వీరిద్దరితో ఈ నెల 5న స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు.

Similar News

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

News December 7, 2025

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

image

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.