News August 22, 2024
నిరసనలు: అటు వాళ్లు – ఇటు వీళ్లు

వివిధ అంశాలపై తెలంగాణలో అధికార – విపక్షాలు గురువారం నిరసనలకు దిగనున్నాయి. అదానీ స్టాక్స్ ప్రైస్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై జేపీసీతో విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి జరగలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్తో విపక్ష బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Similar News
News January 3, 2026
మేడారంలో 50, ములుగులో 20 పడకల ఆసుపత్రులు

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించడానికి మేడారంలో 50 బెడ్స్తో ఫస్ట్ రిఫరల్ సెంటర్, ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 బెడ్ల ప్రత్యేక వార్డు, రిఫరల్ వైద్య సేవలు ఎంజీఎం హాస్పిటల్లో అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశంనిర్ణయించింది. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు.
News January 3, 2026
మేడారంలో 50, ములుగులో 20 పడకల ఆసుపత్రులు

మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలందించడానికి మేడారంలో 50 బెడ్స్తో ఫస్ట్ రిఫరల్ సెంటర్, ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో 20 బెడ్ల ప్రత్యేక వార్డు, రిఫరల్ వైద్య సేవలు ఎంజీఎం హాస్పిటల్లో అందించాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సమన్వయ సమావేశంనిర్ణయించింది. ఎంజీఎంలో సూపరింటెండెంట్ హరీష్ చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని ఆసుపత్రుల నుంచి వైద్య సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించారు.
News January 3, 2026
పేదలకు కార్పొరేట్ వైద్యం: కలెక్టర్

అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో శుక్రవారం అధునాతన వసతులతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్లతో కలిసి కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రారంభించారు. పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేశామన్నారు.


