News August 13, 2024
ఆగస్టు 15ను బంగ్లాలో సంతాప దినంగా పాటించండి: షేక్ హసీనా

బంగ్లాదేశ్లో ఆగస్టు 15ను జాతీయ సంతాప దినంగా పాటించాలని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆమె తరఫున కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన విధ్వంసం, హింసాత్మక ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జాతిపిత బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని కోరారు. హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు.
Similar News
News December 14, 2025
అర్ధరాత్రి వరకు పడుకోవట్లేదా.. ఎంత ప్రమాదమంటే?

మారుతున్న జీవనశైలిలో యువత లేట్ నైట్ వరకు పడుకోవట్లేదు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అర్ధరాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉంటే ముఖ్యంగా మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ఏకాగ్రత కోల్పోతారు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, ఎమోషనల్గానూ వీక్ అవుతారు. BP, షుగర్, ఒబెసిటీ, ఇమ్యూనిటీ తగ్గడం, జీవితకాలం కూడా తగ్గిపోతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News December 13, 2025
అంధ క్రికెటర్ల ఇళ్లలో కాంతులు

AP: అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక(సత్యసాయి), ప్లేయర్ పాంగి కరుణ (అల్లూరి) ఇళ్లలో Dy.CM పవన్ కళ్యాణ్ కాంతులు నింపారు. వారికి TV, ఫ్యాన్, ఇతర గృహోపకరణాలు, నిత్యావసరాలు, బట్టలు, దుప్పట్లు పంపించారు. క్రీడాకారుల కోటాలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తమ ఊరికి వెళ్లే 2 రోడ్లు ప్రయాణానికి యోగ్యంగా లేవని దీపిక చెప్పడంతో రూ.6.2 కోట్లతో రోడ్లను పవన్ <<18548703>>మంజూరు<<>> చేయడం తెలిసిందే.
News December 13, 2025
ఓటేయడానికి వెళ్తున్నారా.. జాగ్రత్త!

TG: రేపు పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉన్న విషయం తెలిసిందే. HYD, ఇతర ప్రాంతాల్లోని ఓటర్లు సొంతూళ్లకు ప్రయాణాలు చేస్తున్నారు. కొందరు బైకులపైనే వెళ్తుండటంతో ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇద్దరు యువకులు బైక్పై వెళ్తుండగా ప్రమాదానికి గురై స్టేషన్ఘన్పూర్లో ప్రాణాలు కోల్పోయారు. మరో ప్రమాదం మెదక్(D) పెద్దశంకరంపేటలో జరిగింది. బైక్పై వెళ్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు చనిపోయారు.


