News August 13, 2024

ఆగస్టు 15ను బంగ్లాలో సంతాప దినంగా పాటించండి: షేక్ హసీనా

image

బంగ్లాదేశ్‌లో ఆగస్టు 15ను జాతీయ సంతాప దినంగా పాటించాలని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా పిలుపునిచ్చారు. ఆమె తరఫున కుమారుడు సాజిబ్ వాజెద్ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల జరిగిన విధ్వంసం, హింసాత్మక ఘటనలో చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. జాతిపిత బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులర్పించాలని కోరారు. హత్యలు, విధ్వంసక చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి, శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News December 2, 2025

సమంత పెళ్లి పోస్టు.. 16 గంటల్లో 79.5 లక్షల లైక్స్

image

దర్శకుడు రాజ్ నిడిమోరును హీరోయిన్ సమంత రెండో <<18438537>>వివాహం<<>> చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌కు 16 గంటల వ్యవధిలోనే దాదాపు 79.5 లక్షల లైక్స్ రావడం గమనార్హం. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ ఈ జోడీకి విషెస్ చెబుతున్నారు. రాజ్ రూపొందించిన ఫ్యామిలీమ్యాన్-2 సమయంలో సమంతతో ప్రేమ మొదలైనట్లు సినీ వర్గాలు తెలిపాయి.

News December 2, 2025

ఇతిహాసాలు క్విజ్ – 84

image

ఈరోజు ప్రశ్న: ఐదు ముఖాల రూపం కలిగి, చిరంజీవిగా బ్రహ్మదేవునిచే వరం పొంది, ఓ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ధర్మసంస్థాపనకు కారణమయ్యాడు. ఆయన ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 2, 2025

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

image

AP: తూర్పుగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 12 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు గల మహిళలు ఈనెల 6వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏడో తరగతి, టెన్త్ , డిగ్రీ, పీజీ (సైకాలజీ డిప్లొమా/ సైకియాట్రీ/ న్యూరోసైన్సెస్/ LLB/ సోషల్ వర్క్/ సోషియాలజీ/ పబ్లిక్ హెల్త్/ MSW), బీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in