News September 28, 2024
OCT 3 నుంచి మావుళ్లమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం ఆయన కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 29, 2025
ప.గో: కారుమూరితో సహా 13 మందిపై కేసులు

మాజీ మంత్రి కారుమూరి వెంక నాగేశ్వరరావుతో సహా 13 మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈనెల 25న తణుకు మండలం తేతలి వై జంక్షన్ సమీపంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ప్లెక్సీల ఏర్పాటుపై జరిగిన వివాదంలో పోలీసులు, వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వీరిపై 189(2), 329(2), 223(a) బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణకుమార్ తెలిపారు.
News December 29, 2025
ప.గో: ఓ వైపు బరులు.. మరోవైపు వినతులు

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ నేపథ్యంలో పలుచోట్ల కోడి పందేల నిర్వహణకు బరులను సిద్ధం చేస్తున్నారు. అధికారిక అనుమతులు రాకముందే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే వీరవాసరం, ఆకివీడు, భీమవరం మండలాల్లో పందేలను నివారించాలంటూ స్థానికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తుండటం గమనార్హం. ఓవైపు పందేలకు సన్నాహాలు, మరోవైపు ప్రజల అభ్యంతరాలు కొనసాగుతున్నాయి.
News December 29, 2025
ప.గో: దర్శనానికి వేళాయె.. ఏడాదికోకసారి లభించే భాగ్యం

ద్వారకాతిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా గిరిప్రదక్షిణ, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభం కానుంది. భక్తుల సౌకర్యార్థం 5 కిలోమీటర్ల మార్గంలో ఎండుగడ్డి, టెంట్లు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. రాత్రి 7 గం: నుంచి ఏడాదికొకసారి లభించే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది.


