News October 23, 2024
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1979: హీరో ప్రభాస్ జననం
1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణ చార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
Similar News
News March 17, 2025
ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు: రేవంత్

TG: 55వేలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టి చరిత్ర సృష్టించామని CM రేవంత్ అన్నారు. ‘దేశంలో ఏ ప్రభుత్వమూ ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉచిత RTC ప్రయాణానికి రూ.5వేల కోట్లు ఖర్చు చేశాం. గృహజ్యోతితో 50లక్షల ఇళ్లలో వెలుగులు చూస్తున్నాం. 43లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్ సిలిండర్ లబ్ధి జరుగుతోంది. కోటీ 30లక్షల చీరలను ఇవ్వాలని నిర్ణయించాం’ అని ‘రాజీవ్ యువవికాసం’ ప్రారంభ కార్యక్రమంలో అన్నారు.
News March 17, 2025
SC వర్గీకరణ.. మిశ్రా కమిషన్ నివేదికకు క్యాబినెట్ ఆమోదం

AP: SC వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై TDLPలో ఎస్సీ ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చర్చించారు. జిల్లాను ఒక యూనిట్గా వర్గీకరణ చేయాలని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలకు కుదరకపోతే ఉమ్మడి జిల్లాలను యూనిట్గా తీసుకోవాలన్నారు. సరైన డేటా లేనందున 2011 జనాభా ప్రాతిపదికన వర్గీకరణకు MLAలు అంగీకారం తెలిపారు.
News March 17, 2025
పదేళ్లలో రూ.16.35లక్షల కోట్లు రైటాఫ్: కేంద్రం

గత పదేళ్లలో రూ.16.35 లక్షల కోట్ల మొండి బకాయిలను బ్యాంకులు రైటాఫ్ చేశాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో వెల్లడించారు. అత్యధికంగా 2018-19FYలో రూ.2.36లక్షల కోట్లను, అత్యల్పంగా 2014-15లో రూ.58,786 కోట్ల బాకీలను రద్దు చేసినట్లు తెలిపారు. రైటాఫ్ చేయడమంటే రుణగ్రహీతలకు ఊరటనిచ్చినట్లు కాదని, వివిధ మార్గాల్లో వాటిని బ్యాంకులు తిరిగి వసూలు చేస్తాయని స్పష్టం చేశారు.