News March 17, 2024
ఓదెల: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

ఓదెలకు చెందిన వెంకటసాయి(28) బీటెక్ పూర్తి చేసుకుని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కాగా తన సోదరుడు, సోదరి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. తనకు తక్కువ వేతనం ఉండి, చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని కొద్ది రోజులుగా మనస్తాపానికి గురవుతున్నాడు. దీంతో శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పొత్కపల్లి పోలీసులు తెలిపారు.
Similar News
News November 17, 2025
KNR: ప్రజావాణికి 288 దరఖాస్తులు

సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి 288 అర్జీలను స్వీకరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆమె ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సత్వర పరిష్కారం కోసం అర్జీలను సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.
News November 17, 2025
KNR: NTR వీరాభిమాని గుండెపోటుతో మృతి

రాజకీయాల్లో చంద్రబాబు నాయడు కంటే సీనియర్, NTR వీరాభిమాని కళ్యాడపు ఆగయ్య గుండెపోటుతో KNRలో మృతి చెందారు. TDP ఆవిర్భావం నుంచి ఆగయ్య పార్టీని వీడకుండా పనిచేస్తూ ఎన్టీఆర్ వీరాభిమానిగా గుర్తింపు పొందారు. పేరు పెట్టి పిలిచేంతగా, ఎన్టీఆర్ కుటుంబంలో తెలిసిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తించి మహానాడు కార్యక్రమంలో ఆగయ్యను సన్మానించారు కూడా.


