News September 20, 2025
భారత్తో వన్డే.. ఆసీస్ అమ్మాయిల విధ్వంసం

భారత్తో నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ టీమ్ చెలరేగింది. 47.5 ఓవర్లలో 412 పరుగులకు ఆలౌట్ అయింది. బెత్ మూనీ 75 బంతుల్లోనే 138 రన్స్తో విధ్వంసం సృష్టించారు. ఆమె ఏకంగా 23 ఫోర్లు బాదారు. జార్జియా 81, పెర్రీ 68, గార్డ్నర్ 39, హీలీ 30 రన్స్తో రాణించారు. ఉమెన్స్ వన్డేల్లో 400 స్కోర్ దాటడం ఇది ఏడోసారి కాగా ఆసీస్ రెండో సారి ఈ ఫీట్ సాధించింది. ఈ భారీ స్కోర్ను భారత్ ఛేదిస్తుందా? COMMENT
Similar News
News September 20, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* రూ.25.30 కోట్ల విలువజేసే 1858 కిలోల డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలను ధ్వంసం చేసిన సైబరాబాద్ పోలీసులు
* రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ ఆసుపత్రులలో లేదా అనుబంధంగా ఉన్న 115 ఫార్మసీల్లో అవకతవకలపై షోకాజ్ నోటీసులు జారీ చేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు.
* ఈ నెలలో అదనంగా 1.17 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం.
* ఈ నెల 23న మేడారానికి సీఎం రేవంత్
News September 20, 2025
తిరుమలను వాడుకోవడం CBN, లోకేశ్కు అలవాటు: YCP

AP: రాజకీయాల కోసం తిరుమల క్షేత్రాన్ని వాడుకోవడం CBN, <<17773731>>లోకేశ్<<>>కు అలవాటుగా మారిందని YCP మండిపడింది. ‘పరకామణిలో చోరీకి పాల్పడుతున్న రవికుమార్ను పట్టుకున్నది 2023, APLలో. అంటే YCP హయాంలో. పోలీసులు విచారించడంతో అతని కుటుంబ సభ్యులు పశ్చాత్తాపం చెంది రూ.14.43కోట్ల ఆస్తులను TTDకి గిఫ్టురూపంలో ఇచ్చేశారు. ఇది చట్టప్రకారం, కోర్టుల న్యాయసూత్రాల ప్రకారం జరిగింది’ అని ట్వీట్ చేసింది.
News September 20, 2025
H1B వీసా నిబంధనపై స్పందించిన భారత్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన H1B వీసా నిబంధనపై భారత్ తొలిసారి అధికారికంగా స్పందించింది. తాజా పరిణామాలను పరిశీలిస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. ఇది ఇరుదేశాల్లోని సంస్థలను ప్రభావితం చేస్తుందన్నారు. ఎన్నో కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెడుతుందని స్పష్టం చేశారు. H1B నిబంధనలతో తలెత్తే ఇబ్బందులను అమెరికా ప్రభుత్వం గుర్తిస్తుందని ఆశిస్తున్నట్లు జైస్వాల్ చెప్పారు.