News September 11, 2024
ODI వరల్డ్ కప్ వల్ల భారత్కు రూ.11,637 కోట్ల బిజినెస్: ICC

వన్డే ప్రపంచ కప్ వల్ల భారత్కు లాభమే జరిగిందని ICC పేర్కొంది. గతేడాది OCT 5 నుంచి NOV 19 వరకు 10 నగరాల్లో ICC మ్యాచ్లు నిర్వహించింది. దీని ద్వారా 1.39 బిలియన్ డాలర్ల (రూ.11,637 కోట్లు) బిజినెస్ జరిగిందని ICC ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచులు చూసేందుకు వచ్చిన ఇంటర్నేషనల్ టూరిస్టుల వసతి, ఆహారం, రవాణా వంటివి అత్యధిక బిజినెస్ను అందించాయి. దీంతోపాటు రాష్ట్రాల్లోని స్టేడియాలు అప్గ్రేడ్ అయ్యాయి.
Similar News
News November 1, 2025
NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <
News November 1, 2025
కొంగ, జింక ఆకారంలో ఎలక్ట్రిక్ పోల్స్.. ఎందుకంటే?

స్థానిక కల్చర్, సంస్కృతి, వైల్డ్ లైఫ్ను ప్రతిబింబించేలా ఆస్ట్రియాలో ఎలక్ట్రిక్ పోల్స్ను ఏర్పాటుచేస్తున్నారు. కొంగలు, దుప్పులు, జింకల ఆకారంలో నిర్మించిన పోల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతితో మిళితమైన డిజైన్ల వల్ల గ్రిడ్ విస్తరణ ప్రాజెక్టులకు ప్రజల సహకారమూ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రియేటివ్ ఇంజినీరింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
News November 1, 2025
ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం

ట్రంప్ ఆంక్షలతో కకావికలమవుతున్న ఇండియన్ స్టూడెంట్స్కు మరో గండం వచ్చి పడింది. ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియాను ఎంచుకుందామనుకుంటే అక్కడా లోకల్ నినాదం స్టార్టైంది. అక్కడి HEIల్లో 50%కి పైగా అడ్మిషన్లు ఆస్ట్రేలియన్లకే ఇవ్వాలని ఆ దేశ విద్యాశాఖ మంత్రి జేసన్ క్లార్ ఆదేశించారు. సిడ్నీ వర్సిటీలో 51% మర్దోక్లో 57% RMITలో 50% మంది విదేశీ విద్యార్థులే ఉన్నారు. దీంతో లోకల్స్కు అవకాశం దక్కేలా కోటా విధించారు.


