News March 13, 2025
SSMB29పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన ఒడిశా డిప్యూటీ సీఎం

సూపర్ స్టార్ మహేశ్బాబు ‘SSMB29’ సినిమా షూటింగ్పై ఒడిశా డిప్యూటీ CM ప్రవతి పరిద అప్డేట్ ఇచ్చారు. ‘గతంలో ‘పుష్ప-2’, ఇప్పుడు రాజమౌళిలాంటి స్టార్ డైరెక్టర్ తీస్తోన్న SSMB29 షూటింగ్నూ ఒడిశాలో జరుపుతుండటం సంతోషం. ప్రస్తుతం కోరాపుట్లో మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాలతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి ఒడిశా టూరిజానికి ఊపునిస్తాయి. షూటింగ్లకు ప్రధాన గమ్యస్థానంగా మారుతుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 13, 2025
‘కోర్ట్’కు పాజిటివ్ టాక్.. ప్రియదర్శి ఎమోషనల్

ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో రామ్ జగదీశ్ తెరకెక్కించిన ‘కోర్ట్’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రీమియర్స్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారు. థియేటర్లో నేలపై కూర్చొని నిర్మాత నానిని హత్తుకొని తన సంతోషాన్ని పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను నాని షేర్ చేశారు.
News March 13, 2025
₹ చిహ్నం తొలగింపుతో TN పరువు తీసిన స్టాలిన్: అన్నామలై ఫైర్

భారత్లో TN హాస్యాస్పదంగా మారిపోయిందని ఆ రాష్ట్ర BJP చీఫ్ అన్నామలై అన్నారు. హిందీకి వ్యతిరేకంగా DMK, CM స్టాలిన్ మూర్ఖత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రూపీ సింబల్ తొలగించి తమిళ పదం పెట్టడంపై ఘాటుగా స్పందించారు. ‘రూపీ చిహ్నం రూపొందించింది తమిళుడైన ఉదయ్. ఆయన తండ్రి 1971లో DMK MLA. తమిళుడు రూపొందించిన ఈ చిహ్నాన్ని దేశం సగర్వంగా స్వీకరించింది. ఇప్పుడు స్టాలిన్ వల్ల పరువు పోతోంది’ అని అన్నారు.
News March 13, 2025
గాయపడ్డ నటి.. నుదిటిపై 13 కుట్లు!

సీనియర్ నటి, ఎవర్గ్రీన్ బ్యూటీగా పేరొందిన భాగ్యశ్రీ గాయపడ్డారు. పికిల్బాల్ ఆడుతుండగా ఆమె నుదిటిపై లోతైన గాయం తగిలింది. దీంతో నుదిటిపై 13 కుట్లు పడ్డాయని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా చివరగా ‘రాధేశ్యామ్’, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రాల్లో నటించారు.