News May 21, 2024

చట్టాన్ని అతిక్రమించిన అధికారులు జైలుకే: బొండా ఉమా

image

AP: సీఎం జగన్‌ను నమ్మి చట్టాన్ని అతిక్రమించిన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ‘వైసీపీ నేతల ఇళ్లలో మారణాయుధాలు దొరికినా ఎలాంటి కేసులు లేవు. అరాచకం సృష్టించిన నేతలను అరెస్ట్ చేయాలి. సిట్ నివేదికను డీజీపీ బయటపెట్టాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

బాబర్ ఖాతాలో చెత్త రికార్డు

image

పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజం ఫ్లాప్ షో కొనసాగుతోంది. సెంచరీ చేయకుండా అత్యధిక వన్డేలు ఆడిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ(83)ని సమం చేశారు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ జయసూర్య(88) తొలి స్థానంలో ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ చందర్‌పాల్(78) వీరి తర్వాతి స్థానంలో ఉన్నారు. నిన్న SLతో జరిగిన మ్యాచులో బాబర్ 51 బంతుల్లో 29 పరుగులు చేశారు. చివరగా 2023 ఆసియాకప్‌లో నేపాల్‌పై సెంచరీ బాదారు.

News November 12, 2025

మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా

image

‘టాటా’ టూవీలర్ వాహనాలను తయారు చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని సంస్థ ఖండించింది. సదరు కంపెనీ 125సీసీ బైక్‌ను రూ.60వేలకే అందిస్తోందని, ఇది 90కి.మీ మైలేజీ ఇస్తోందంటూ ఇటీవల కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. దీంతో టాటా క్లారిటీ ఇచ్చింది. అలాంటి మోసపూరిత యాడ్స్‌ను నమ్మవద్దని వినియోగదారులకు సూచించింది. తమ అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే పరిశీలించాలని కోరింది.

News November 12, 2025

బంద్ ఎఫెక్ట్.. విద్యార్థులకు షాక్!

image

TG: ప్రైవేట్ కాలేజీల <<18182444>>బంద్‌<<>>తో పరీక్షలకు దూరమైన ఫార్మసీ విద్యార్థులకు విద్యాశాఖ ఊహించని షాక్ ఇచ్చింది. సమ్మె సమయంలో నిర్వహించిన పరీక్షలు మళ్లీ నిర్వహించలేమని, సప్లిమెంటరీ రాసుకోవాలని స్పష్టం చేసింది. కాగా దీనిపై సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తామని FATHI తెలిపింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని ఈ నెల 3 నుంచి 4 రోజుల పాటు ప్రైవేట్ కాలేజీలు బంద్ నిర్వహించిన సంగతి తెలిసిందే.