News October 24, 2024

పుష్ప-2 రిలీజ్‌పై అధికారిక ప్రకటన

image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప-2’. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని వెల్లడిస్తూ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతకుముందు ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘పుష్ప’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Similar News

News October 24, 2024

‘రాజాసాబ్’ మోషన్ పోస్టర్‌.. 24 గంటల్లో 8.3M వ్యూస్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ సినిమా నుంచి నిన్న మోషన్ పోస్టర్ రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. రిలీజైన 24 గంటల్లోనే దీనికి 8.3 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రికార్డ్స్ & ప్రభాస్ ఒకే పేజీలో ఉంటారని, యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు.

News October 24, 2024

Stock Market: ఫ్లాట్‌గా ముగిశాయి

image

వ‌రుస న‌ష్టాల‌తో డీలాప‌డిన దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం ఫ్లాట్‌గా ముగిశాయి. 80,170 వ‌ద్ద బ‌ల‌మైన రెసిస్టెన్స్‌ను దాట‌లేక‌పోయిన సెన్సెక్స్ చివ‌రికి 16 పాయింట్ల న‌ష్టంతో 80,065 వ‌ద్ద స్థిర‌ప‌డింది. ఉద‌యం అర‌గంట న‌ష్టాల‌ను 24,350 వ‌ద్ద స‌పోర్ట్ తీసుకొని అధిగ‌మించిన నిఫ్టీ చివ‌ర‌కు 36 పాయింట్లు కోల్పోయి 24,399 వ‌ద్ద నిలిచింది. Ultratech 2.66% లాభ‌ప‌డ‌గా, HindUnilvr 5.8% న‌ష్ట‌పోయింది.

News October 24, 2024

ఒక్కో కార్మికుడికి రూ.93,750.. దీపావళి బోనస్ రిలీజ్

image

TG: ఒక్కో కార్మికుడికి దీపావళి బోనస్‌గా సింగరేణి యాజమాన్యం రూ.93,750 ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా యాజమాన్యం బోనస్ అమౌంట్ రూ.358 కోట్లు రిలీజ్ చేసింది. అంతకుముందు లాభాల వాటా రూ.796 కోట్లను కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు అందజేసిన సంగతి తెలిసిందే.