News November 24, 2024

OFFICIAL: మహారాష్ట్ర ఫలితాలు

image

మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 132, శివసేన (SHS) 57, ఎన్సీపీ 41, JSS 2, RSJP 1 సీటు కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి 49 సీట్లు మాత్రమే వచ్చాయి. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (శరద్) 10, ఎస్పీ 2, PAWPOI 1 సీటు సాధించాయి. ఇతరులకు 6 సీట్లు వచ్చాయి.

Similar News

News December 10, 2025

IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) ఈస్ట్రన్ రీజియన్‌లో 509 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు నేటి నుంచి జనవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు NATS/NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:io cl.com/

News December 10, 2025

దారిద్ర్య దహన గణపతి స్తోత్రం ఎందుకు పఠించాలి?

image

ఆర్థిక సమస్యలు, దారిద్ర్య బాధలను తొలగించుకోవడానికి ఈ స్తోత్రాన్ని పఠించాలని పండితులు సూచిస్తున్నారు. నిత్యం పఠిస్తే గణేశుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. ‘తలపెట్టిన పనులు అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. ఈ మహా మహిమాన్విత స్తోత్రాన్ని 45 రోజుల పాటు క్రమం తప్పకుండా పఠిస్తే, ఆ వంశంలో పది తరాల వరకు దారిద్ర్య బాధలుండవని శాస్త్రాలు చెబుతున్నాయి’ అని అంటున్నారు.

News December 10, 2025

దారిద్ర్యాన్ని తొలగించే గణపతి స్తోత్రం

image

సకల కార్యాలు నిర్విఘ్నంగా సాగాలని మనం విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేస్తుంటాం. అలాగే ‘సువర్ణ వర్ణ సుందరం’ అంటూ మొదలయ్యే ‘దారిద్ర్య దహన గణపతి స్తోత్రం’ పఠిస్తే దారిద్ర్యం తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. వినాయకుడి అనుగ్రహం కోసం భక్తి, శ్రద్ధలతో ఈ స్తోత్రాన్ని తప్పక పఠించాలని సూచిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని ఎప్పుడు, ఎలా పఠించాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.