News September 29, 2024
OFFICIAL: ఐపీఎల్-2025 ఆక్షన్ రూల్స్ ఇవే

IPL-2025కు సంబంధించి IPL గవర్నింగ్ కౌన్సిల్ ప్లేయర్ రెగ్యులేషన్స్ను ప్రకటించింది. ఒక్కో ఫ్రాంఛైజీ ప్రస్తుతం ఉన్న జట్టులో ఆరుగురు ప్లేయర్లను రిటెన్షన్/RTM ఆప్షన్ ద్వారా రిటైన్ చేసుకోవచ్చని తెలిపింది. వీరిలో MAX ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు లేదా MAX ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు ఉండాలని పేర్కొంది. 2025 వేలానికి ₹120కోట్లను ఆక్షన్ పర్స్గా ఖరారు చేసింది. టోటల్ శాలరీ క్యాప్ ₹146కోట్లు అని తెలిపింది.
Similar News
News November 27, 2025
భూపాలపల్లి: హత్యాయత్నం.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

మద్యం మత్తులో భార్యను, కొడుకును చంపాలనే ఉద్దేశంతో గొడ్డలితో దాడి చేసి గాయపర్చిన వ్యక్తిపై నేరం రుజువైనందున భూపాలపల్లి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి A.నాగరాజు నిందితుడికి 10ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు ఇచ్చారు. భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మార్త రాజేశ్ ఈ నేరం చేశాడని, అతడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సంకీర్త్ అభినందించారు.
News November 27, 2025
వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు

TG: వికారాబాద్ జిల్లాలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పూడూరు మండలం రాకంచెర్లలో సెకను పాటు భూమి కంపించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్లు గ్రామానికి చేరుకుని ఆరా తీస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.


