News September 30, 2024
దసరా ఉత్సవాల్లో పొరపాటు జరిగితే అధికారులదే బాధ్యత: మంత్రి

AP: ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులదే బాధ్యత అని మంత్రి రామనారాయణరెడ్డి హెచ్చరించారు. 13 ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. VVIP దర్శనాలకు ఉ.8-10, మ.2-4 గంటల వరకు, వృద్ధులు, దివ్యాంగులకు సా.4-5 గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు. OCT 9న అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు.
Similar News
News December 7, 2025
అర్ధరాత్రి తినే అలవాటు ఎంత ప్రమాదమంటే?

అర్ధరాత్రి తినే అలవాటు మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘లేట్ నైట్ తినే అలవాటు మీ నిద్ర, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. రాత్రి సమయంలో మీ శరీరం ఫ్యాట్ని బర్న్ చేస్తుంది. కానీ, మీరు తినడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ కాస్తా స్టోరేజ్ మోడ్కు వెళ్తుంది. దాంతో మీ శరీరం బరువు పెరుగుతుంది. అధిక బరువు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది’ అని చెబుతున్నారు.
News December 7, 2025
న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.
News December 7, 2025
‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.


