News September 30, 2024
దసరా ఉత్సవాల్లో పొరపాటు జరిగితే అధికారులదే బాధ్యత: మంత్రి

AP: ఇంద్రకీలాద్రిపై OCT 3 నుంచి 12 వరకు జరిగే దసరా మహోత్సవాల్లో ఎలాంటి పొరపాట్లు తలెత్తినా అధికారులదే బాధ్యత అని మంత్రి రామనారాయణరెడ్డి హెచ్చరించారు. 13 ప్రభుత్వ శాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. VVIP దర్శనాలకు ఉ.8-10, మ.2-4 గంటల వరకు, వృద్ధులు, దివ్యాంగులకు సా.4-5 గంటల వరకు టైం స్లాట్ కేటాయించినట్లు తెలిపారు. OCT 9న అమ్మవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు.
Similar News
News November 11, 2025
స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
News November 11, 2025
రాష్ట్రంలో 175 పారిశ్రామిక పార్కులు: CBN

AP: రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు నెలకొల్పుతామని CM CBN ప్రకటించారు. ‘ఇపుడు15 MSMEలు ప్రారంభించాం. మరో 35కి శంకుస్థాపన చేశాం. కొత్తగా మరో 70 ఏర్పాటుచేస్తాం’ అని చెప్పారు. వీటిలో 99 పరిశ్రమలు రానున్నాయన్నారు. ప్రధాని మోదీ దేన్ని ప్రవేశపెట్టినా APకి ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో PPAల రద్దుతో ₹9వేల CR వృధా చేశారన్నారు. పెట్టుబడిదారులు తిరిగి వస్తున్నారన్నారు.
News November 11, 2025
వేదాలు ఎలా ఏర్పడ్డాయో మీకు తెలుసా?

వేదాలు అపౌరుషేయాలు. ఇవి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం నుంచి సహజంగా వెలువడినవి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించాలని సంకల్పించగా, ఆయనకు మొదట ‘ఓం’ అనే పవిత్ర ప్రణవనాదం వినిపించింది. బ్రహ్మ ఆ ఓంకార నాదాన్ని ధ్యానంలో గ్రహించి, ఆ పరమశబ్దాన్ని వేదజ్ఞానం రూపంలో మహర్షులు, రుషుల ద్వారా లోకానికి వెలువరించారు. అందుకే వేదాలను సనాతన ధర్మానికి మూలమైన దివ్యజ్ఞానంగా భావిస్తారు. <<-se>>#VedikVibes<<>>


