News March 21, 2025

SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

image

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్‌లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.

Similar News

News March 21, 2025

MNCL: ప్రజలను కాపాడడమే ప్రధాన లక్ష్యం: సీపీ

image

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం రోడ్డు సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో పోలీస్, ట్రాఫిక్, ఇతర అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్స్ సందర్శించాలని, ప్రమాదాలకు సంబందించిన కారణాలు గుర్తించి వాటి నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్లపై రేడియం స్టిక్కర్లతో కూడిన సూచికలను ఏర్పాటు చేయాలన్నారు.

News March 21, 2025

రేపు కర్ణాటక బంద్.. విద్యార్థుల్లో ఆందోళన

image

గత నెలలో బెళగావిలో RTC బస్సు కండక్టర్‌పై మరాఠీ అనుకూలవాదులు చేసిన దాడికి నిరసనగా కర్ణాటకలో కన్నడ సంఘాలు రేపు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 వరకు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోనున్నాయి. ఓవైపు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో తమ పరిస్థితేంటంటూ విద్యార్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక వెళ్లే తెలుగురాష్ట్రాలవారు ప్రయాణం వాయిదా వేసుకోవడమే మంచిది.

News March 21, 2025

చెన్నైలో రోడ్డుకు రవిచంద్రన్ అశ్విన్ పేరు?

image

మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరును చెన్నైలో ఓ రోడ్డుకు పెట్టే అవకాశం ఉంది. అశ్విన్ స్వగృహం ఉన్న వెస్ట్ మాంబళంలోని రామకృష్ణాపురం ఫస్ట్ స్ట్రీట్‌కు తన పేరును పెట్టే ప్రతిపాదనను ఆయన సంస్థ ‘క్యారమ్ బాల్ ఈవెంట్ అండ్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్’ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు సమర్పించింది. కాగా.. ఈ ఏడాది IPLలో CSKకు ఆడనున్న అశ్విన్, సీజన్ ముగిశాక IPL నుంచి రిటైరవ్వొచ్చని సమాచారం.

error: Content is protected !!