News September 28, 2024
అయోధ్య రామాలయం ప్రసాదాన్ని టెస్ట్కు పంపిన అధికారులు!

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న వేళ అయోధ్యలోని రామజన్మభూమి ట్రస్ట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో ప్రసాదంగా పంపిణీ చేస్తోన్న యాలకుల నమూనాలను టెస్ట్ చేయించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు పంపించారు. ప్రతిరోజూ సగటున 80,000 యాలకులను పవిత్ర నైవేద్యంగా పంపిణీ చేస్తారని రామాలయం ట్రస్ట్ అధికారి ప్రకాష్ గుప్తా తెలిపారు.
Similar News
News February 5, 2026
ఇలాంటివి చేయాలంటే భయపడాలి: చంద్రబాబు

AP: పామాయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి తయారు చేశారని సిట్ నివేదిక ఇచ్చిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘YCP హయాంలో చాలా అపచారాలు చేశారు. మళ్లీ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కరుడుగట్టిన నేరస్థుడి తరహాలో నిన్న ఆయన అబద్ధాలు చెబుతున్నారు. ఇలాంటివి చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. దీనిని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. దీని పవిత్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.
News February 5, 2026
వారికి తెలిసే తప్పు చేశారు: పవన్

AP: వేంకటేశ్వరుడి ముందు మోకరిల్లి YCP వాళ్లు క్షమాపణలు చెప్పాలని Dy.CM పవన్ డిమాండ్ చేశారు. ‘ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ రాలేదు. జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నితమైన అంశం. 2022లోనే కల్తీ కలిసిందని రిపోర్టులు వస్తే వాటిని తొక్కిపెట్టారు. వాళ్లకి అంతా తెలిసే చేశారు. తిరుమలకు 2 కొండలు చాలు అనే ధోరణి నుంచి వచ్చిన పార్టీ మీది. రథం కాలిపోతే పిచ్చోడు చేశారు అంటారు’ అని వ్యాఖ్యానించారు.
News February 5, 2026
ICAR-IARIలో ఉద్యోగాలు

ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(<


