News January 3, 2025
అధికారులు సీరియస్గా అర్జీలు పరిష్కరించాలి: అనగాని

APలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అర్జీల పరిష్కారంపై ప్రజలు సంతృప్తిగా లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంగళగిరి CCLA ఆఫీసులో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్షించారు. 2016లో అసెంబ్లీలో తాను ప్రస్తావించిన 22A సమస్యకే ఇంకా పరిష్కారం చూపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై CM కూడా సీరియస్గా ఉన్నారని, ప్రజలు ఎంతమేరకు సంతృప్తిగా ఉన్నారనే విషయంపై అధికారులు ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
Similar News
News January 10, 2026
OTTలోకి ‘దండోరా’.. డేట్ ఫిక్స్

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ నెల 14 నుంచి తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మురళీ కాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ల డ్రెస్సింగ్పై శివాజీ చేసిన <<18646239>>కామెంట్స్<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
News January 10, 2026
రాష్ట్రంలో 97 పోస్టులు నోటిఫికేషన్ విడుదల

<
News January 10, 2026
MSVG టికెట్ ధరల పెంపు.. రెండు రోజుల కిందటే అనుమతి?

చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టికెట్ ధరల <<18817046>>పెంపునకు<<>> TG ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఈ నెల 8వ తేదీ ఉండటంతో 2 రోజుల కిందటే టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. కాసేపట్లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తాజాగా జీవో బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఈ మూవీ ఎల్లుండి థియేటర్లలోకి రానుండగా, రేపు ప్రీమియర్లు వేయనున్నారు.


