News October 7, 2024

నటుడితో ఓలా ఎలక్ట్రిక్ ఓనర్ వాగ్వాదం: 9% క్రాషైన షేర్లు

image

వరెస్ట్ సర్వీస్ కంప్లైంట్లు, ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్‌తో ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ షేర్లు 43% తగ్గాయి. నటుడు కునాల్‌తో కంపెనీ ఓనర్ భవీశ్ అగర్వాల్ Xలో వాదనకు దిగడంతో నేడు 9% క్రాష్ అయ్యాయి. ‘భారత కస్టమర్లకు గొంతుందా? వాళ్లకిదేనా దక్కేది’ అంటూ దుమ్ముపట్టిన ఓలా స్కూటర్ల ఫొటోను కునాల్ పోస్ట్ చేశారు. ‘సాయం చేస్తే ఈ పెయిడ్ ట్వీట్, మీ ఫెయిల్డ్ కెరీర్లో సంపాదన కన్నా ఎక్కువే ఇస్తాన’ని భవీశ్ స్పందించారు.

Similar News

News September 16, 2025

షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు: BCCI

image

పాక్ క్రికెటర్లకు భారత ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై <<17723523>>వివాదం<<>> తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై BCCI సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ‘ప్రత్యర్థులతో షేక్ హ్యాండ్‌కు సంబంధించి రూల్ బుక్‌లో ఎలాంటి స్పెసిఫికేషన్ లేదు. అది ఒక గుడ్‌విల్ జెశ్చర్ మాత్రమే. చట్టం కాదు. అలాంటి రూల్ లేనప్పుడు సత్సంబంధాలు లేని ప్రత్యర్థికి టీమ్ ఇండియా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

News September 16, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.146.3 కోట్లు రిలీజ్

image

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. నిన్న 13,841 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 1.29 లక్షల ఇళ్లు పురోగతిలో ఉన్నాయన్నారు.

News September 16, 2025

నేడు ముఖ్య నేతలతో జగన్ సమావేశం

image

AP: వైసీపీ చీఫ్ జగన్ ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లి రానున్నారు. ఉదయం 11.55గంటలకు గన్నవరం చేరుకోనున్న ఆయన, మధ్యాహ్నం 12.10కి తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. అనంతరం అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో ఆయన సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజీలు, పంటల గిట్టుబాటు ధరలపై ప్రభుత్వాన్ని జగన్ నిలదీస్తోన్న విషయం తెలిసిందే.