News November 21, 2024
ఉద్యోగులకు భారీ షాకివ్వనున్న ఓలా ఎలక్ట్రిక్!

ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగులకు షాకివ్వనుందని సమాచారం. 500 మందికి పైగా తొలగించనుందని తెలుస్తోంది. మార్జిన్లను మెరుగుపర్చుకోవడం ద్వారా లాభాలు పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. అందుకే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఆరంభించినట్టు తెలిసింది. 2022, సెప్టెంబర్, జులైలోనూ కంపెనీ రెండుసార్లు ఇలాగే చేసింది. యూజుడ్ కార్స్, క్లౌడ్ కిచెన్, గ్రాసరీ డెలివరీ యూనిట్లను మూసేసి 1000 మందిని ఇంటికి పంపించేసింది.
Similar News
News December 10, 2025
శ్రీ సత్యసాయి, అనంతలో ‘స్క్రబ్ టైఫస్’ కలకలం

కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ అనంత జిల్లాకూ పాకింది. రాయదుర్గం సమీపంలోని తాళ్లకెరకు చెందిన బాలిక జ్వరంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా రక్తపరీక్షలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి(D) ముదిగుబ్బ మండలానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం చేరారు. జ్వరం ఉండటంతో ఆమెకూ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2 రోజుల క్రితం హిందూపురంలో ఓ మహిళకు స్క్రబ్ టైఫస్ సోకింది.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


