News October 20, 2024
ఒలింపిక్ వీరుడికి క్యాన్సర్.. ఇంకా నాలుగేళ్లే!
బ్రిటిష్ ఒలింపిక్ సైక్లింగ్ ఛాంపియన్ సర్ క్రిస్ హోయ్ క్యాన్సర్తో బాధపడుతున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను రెండు నుంచి నాలుగేళ్ల మధ్యలో జీవించే అవకాశం ఉందని వారు చెప్పినట్లు తెలిపారు. 48 ఏళ్ల స్కాట్ 2004- 2012 మధ్యకాలంలో ఆరుసార్లు ఒలింపిక్ స్వర్ణాలు గెలుచుకున్నారు.
Similar News
News October 21, 2024
నిద్రలో ఈ మూడు దశలు తెలుసా?
నిద్రలో కళ్లు వేగంగా కదులుతుండే దశ(REM), నెమ్మదిగా కదిలే దశ(NREM) ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వాటిలోనూ మూడు ఉప దశలున్నాయి. తొలి ఉప దశ పేరు N1. అప్పుడప్పుడే నిద్ర పడుతున్న సమయమిది. ఇక రెండోది N2. గుండె వేగం, శరీర ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. మూడో ఉప దశను N3గా పిలుస్తారు. ఇది లోతైన నిద్ర. ఈ దశలో మనిషి మత్తుగా పడుకుంటాడు. N3లో ఎక్కువ సేపు ఉంటే అలసట ఉండదని పరిశోధకులు వివరించారు.
News October 21, 2024
మహిళల T20 WC విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 విజేతగా న్యూజిలాండ్ అవతరించింది. ఫైనల్ మ్యాచ్లో సౌతాఫ్రికాపై 32 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 158/5 స్కోర్ చేసింది. ఛేదనకు దిగిన సఫారీ జట్టు 20ఓవర్లలో 126/9 మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్ తొలి టీ20 వరల్డ్ కప్ అందుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఆరుసార్లు, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఒక్కోసారి T20 WC సాధించాయి.
News October 20, 2024
ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం.. కానీ: జూడాలు
బెంగాల్లో జూడాలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. అయితే తమ నిరాహార దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. కోల్కతా లేడీ ట్రైనీ డాక్టర్ రేప్&మర్డర్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ వాళ్లు దీక్ష చేస్తున్నారు. అయితే వారి డిమాండ్లలో చాలావరకు పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం మమత అంటున్నారు. కాగా హెల్త్ సెక్రటరీని తొలగించేందుకు మాత్రం ఆమె ఒప్పుకోకపోవడంతో వివాదానికి ముగింపు పడట్లేదు.