News August 6, 2024
ఒలింపిక్స్ ఫుట్బాల్: ఫైనల్ చేరిన జట్లివే..

పారిస్ ఒలింపిక్స్లో మెన్స్ ఫుట్బాల్లో స్పెయిన్, ఫ్రాన్స్ జట్లు ఫైనల్ చేరాయి. స్పెయిన్, మొరాకో మధ్య జరిగిన తొలి సెమీస్లో 2-1తో స్పానిష్ జట్టు విజయం సొంతం చేసుకుంది. రెండో సెమీస్లో ఈజిప్ట్పై 3-1తేడాతో ఆతిథ్య జట్టు గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 9న జరగనుంది. మరోవైపు ఎల్లుండి మొరాకో, ఈజిప్టు కాంస్యం కోసం తలపడనున్నాయి.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News December 6, 2025
వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 6, 2025
95% కనెక్టివిటీని పునరుద్ధరించాం: ఇండిగో

95% నెట్వర్క్ కనెక్టివిటీని పునరుద్ధరించినట్లు ఇండిగో తెలిపింది. నిన్న 700కు పైగా సర్వీసులు అందుబాటులో ఉంచగలిగామని ఈరోజు మొత్తంలో 1500 ఫ్లైట్లను నడుపుతున్నామని శనివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ‘138 గమ్యస్థానాలకుగాను 135 ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించాం. మా ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాం. సంక్షోభంలో మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని చెప్పింది.
News December 6, 2025
కోట్ల మందికి తాగునీటి కొరత!

2050 నాటికి కోట్ల మందికి తాగునీరు అందని పరిస్థితి తలెత్తవచ్చని తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరిస్తోంది. వియన్నాకు చెందిన కాంప్లెక్సిటీ సైన్స్ హబ్, ప్రపంచ బ్యాంక్ కలిసి ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని 100కు పైగా నగరాలను పరిశీలించాయి. ఇష్టారీతిన విస్తరించుకుంటున్న నగరాల వలన 220M మందికి స్వచ్ఛమైన నీరు అందదని వెల్లడించింది. సరైన ప్రణాళిక ద్వారానే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని సూచించింది.


