News July 26, 2024
ఒలింపిక్స్: ఏ క్రీడలో ఎంతమంది పాల్గొంటున్నారంటే?

ఒలింపిక్స్లో మొత్తం 16 క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 29మంది, వెయిట్ లిఫ్టింగ్, ఈక్వెస్ట్రియన్, జుడో, రోయింగ్లలో ఒక్కొక్కరు పాల్గొంటున్నారు. షూటింగ్ 21, హాకీ 19, టేబుల్ టెన్నిస్ 8, బ్యాడ్మింటన్ 7, రెజ్లింగ్ 6, బాక్సింగ్ 6, ఆర్చరీ 6, గోల్ఫ్ 4, టెన్నిస్ 3, సెయిలింగ్, స్విమ్మింగ్లో ఇద్దరు చొప్పున ఆడతారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News January 7, 2026
30ల్లో స్కిన్ కేర్ ఇలా..

30ల్లోకి అడుగుపెట్టాక చర్మం నెమ్మదిగా సాగే గుణాన్ని కోల్పోతుంది. తేమనిచ్చే మాయిశ్చరైజర్ ఈ వయసులో సరిపోదు. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలి. పగలు ఇ, సి విటమిన్లు, గ్రీన్ టీ ఉన్న ఉత్పత్తులు, రాత్రి రెటినాయిడ్ క్రీములు వాడాలి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచడంతోపాటు చర్మంపై ఏర్పడిన ముడతలు, గీతలను తగ్గిస్తాయి. వీటితో పాటు సన్ స్క్రీన్, ఫేషియల్ ఎక్సర్సైజ్లు చేయడం కూడా మంచిది.
News January 7, 2026
జ్యోతిషం: పెళ్లి ఆలస్యం కావడానికి కారణాలివే..

జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు వివాహ సమయాన్ని నిర్ణయిస్తాయి. జాతకంలో కళత్ర స్థానం బలహీనంగా ఉన్నప్పుడు, ఆ స్థానంలో శని, రాహువు గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు పెళ్లి ఆలస్యమవుతుంది. కుజ దోషం ఉన్నా, గురు గ్రహ అనుగ్రహం లోపించినా సంబంధాలు కుదరడం కష్టమవుతుంది. దోషాలను గుర్తించి తగిన శాంతులు చేయిస్తే ఆటంకాలు తొలగి వివాహ యోగం వస్తుంది. దోషాలు పోయేందుకు పరిష్కార మార్గాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 7, 2026
వరి మాగాణుల్లో వెల్లుల్లి సాగు.. మంచి దిగుబడి, ఆదాయం

మన దగ్గర సాధారణంగా వరి కోతలు పూర్తయ్యాక అదే భూమిలో మొక్కజొన్న, సన్ ఫ్లవర్, అపరాలు నాటుతుంటాం. బంగ్లాదేశ్లో మాత్రం వరి కోతలు పూర్తయ్యాక ఆ భూమిలో వెల్లుల్లి నాటుతారు. వరి పంటకు వేసిన ఎరువుల వల్ల నేల సారవంతంగా ఉంటుంది. భూమిలో తేమ, వరికి వాడిన ఎరువుల వల్ల వెల్లుల్లి పంట చాలా వేగంగా, పెద్ద పరిమాణంలో పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభిస్తోందని అక్కడి రైతులు చెబుతున్నారు.


