News August 1, 2024
OLYMPICS: ప్రణయ్పై లక్ష్యసేన్ విజయం

పారిస్ ఒలింపిక్స్ ప్రీక్వార్టర్స్లో హెచ్ఎస్ ప్రణయ్తో జరిగిన పోరులో లక్ష్యసేన్ విజయం సాధించారు. తొలి సెట్లో 21-12, రెండో సెట్లో 21-6 తేడాతో ప్రణయ్ను ఓడించి క్వార్టర్స్కు దూసుకెళ్లారు. <<-se>>#Olympics2024<<>>
Similar News
News December 31, 2025
ఎవరి జోక్యమూ లేదు.. చైనా మధ్యవర్తిత్వ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

భారత్-పాక్ మధ్య <<18718800>>మధ్యవర్తిత్వం<<>> చేశామన్న చైనా వాదనను భారత్ కొట్టిపారేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కేవలం రెండు దేశాల సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని పలు వివాదాలను పరిష్కరించామన్న చైనా విదేశాంగ మంత్రి.. భారత్-పాక్ ఉద్రిక్తతలనూ తగ్గించామని చెప్పటంతో భారత్ స్పందించింది.
News December 31, 2025
2025: గోల్డ్ ₹57వేలు, వెండి ₹1.6L పెరిగింది!

ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోయి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. JANలో 10gల బంగారం ధర ₹78,000 ఉండగా.. డిసెంబర్ 31న ₹1,35,880తో ముగించి ఇన్వెస్టర్లకు దాదాపు 78%(₹57k) లాభాలను అందించింది. అటు కిలో వెండి ధర 2025 ప్రారంభంలో ₹98,000 ఉండగా ప్రస్తుతం ₹2.58 లక్షలకు చేరుకొని 150%(₹160k) పైగా వృద్ధిని నమోదు చేసింది. కొత్త ఏడాదిలో గోల్డ్, సిల్వర్ ధరలెలా ఉంటాయో చూడాలి.
News December 31, 2025
పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్!

AP: జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి గట్టి షాక్ తగిలిందన్న చర్చ సాగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేశారు. ఇక ఆయన కుమారుడు, MP మిథున్ రెడ్డి స్థానం రాజంపేట, సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి సీటు తంబళ్లపల్లి సైతం చిత్తూరులో లేవు. దీంతో పెద్దిరెడ్డి హవాకు బ్రేక్ పడిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


