News July 29, 2024
Olympics: క్రికెట్లో వందేళ్ల క్రితం ఫ్రాన్స్కు సిల్వర్

కొన్నేళ్లుగా ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చాలని డిమాండ్ వినిపిస్తోంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వందేళ్ల క్రితం 1900 పారిస్ ఒలింపిక్స్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య ఏకైక క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో గెలిచిన ఇంగ్లండ్ గోల్డ్, ఓడిన ఫ్రాన్స్ సిల్వర్ మెడల్ పొందాయి. అయితే తమ దగ్గర క్రికెట్కు ఆదరణ లేకపోవడంతో ఫ్రాన్స్ పతకం సాధించిన విషయం ఆ దేశస్థులకే సరిగ్గా తెలియదట. <<-se>>#OLYMPICS2024<<>>
Similar News
News October 16, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

▸సుధీర్ బాబు నటించిన ‘జటాధర’ సినిమా ట్రైలర్ను రేపు విడుదల చేయనున్న మహేశ్ బాబు
▸వెట్రిమారన్, శింబు కాంబోలో వస్తోన్న ‘అరసన్'(తెలుగులో సామ్రాజ్యం) సినిమా ప్రోమోను రేపు రిలీజ్ చేయనున్న Jr.NTR
▸విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సినిమా చేసే అవకాశం?
▸ మెటా AIకి దీపికా పదుకొణె వాయిస్.. తొలి ఇండియన్ సెలబ్రిటీగా రికార్డు
News October 16, 2025
PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.
News October 16, 2025
3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.