News August 7, 2024
OLYMPICS: దేశం గుండె పగిలింది!

ఈ ఒలింపిక్స్లో మనకు అందని ద్రాక్షగా మిగిలిన స్వర్ణాన్ని వినేశ్ ఫొగట్ కచ్చితంగా తీసుకొస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఆమెను దురదృష్టం వెంటాడింది. 50 కిలోల విభాగంలో ఉన్న వినేశ్ కేవలం 100 గ్రా. బరువు ఎక్కువ ఉండటంతో <<13796504>>అనర్హత<<>> వేటు పడింది. ఈ స్థాయికి చేరుకునేందుకు ఎన్నో అవమానాలను, గాయాలను వినేశ్ భరించారు. చివరికి ఆమె కష్టాన్ని, 140కోట్లమంది ఆశల్ని 100 గ్రాముల బరువు బూడిదలో పోసిన పన్నీరు చేసింది.
Similar News
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్మెంట్లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.


