News December 4, 2024

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు

image

AP: కాకినాడ పోర్టులో డిప్యూటీ CM పవన్ సీజ్ చేయించిన షిప్‌లో ఇవాళ మరోసారి తనిఖీలు చేస్తున్నారు. మల్టీ డిసిప్లీనరీ కమిటీ సముద్రంలోకి బయల్దేరగా, రేషన్ బియ్యం నమూనాలు తీసుకోనుంది. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి వచ్చింది? ఎంత మొత్తంలో ఉంది? తదితరాలపై కమిటీ నేడు వివరాలు సేకరించనుంది. పోర్టు, కస్టమ్స్, పౌరసరఫరాలు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కూడిన కమిటీ నేడు ఆ వివరాలను కలెక్టర్‌కు అందించనుంది.

Similar News

News November 13, 2025

ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

image

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.

News November 13, 2025

విశాఖ సదస్సుతో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: సీఎంవో

image

AP: విశాఖలో జరగనున్న CII భాగస్వామ్య సదస్సుకు రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని CMO తెలిపింది. ఈ సమావేశంలో ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని వెల్లడించింది. ‘ఇన్వెస్ట్ ఇన్ ఏపీ’ సందేశాన్ని సమ్మిట్ ద్వారా చాటి చెప్పాలని సీఎం చంద్రబాబు సంకల్పించినట్లు పేర్కొంది. కాగా ఈ సదస్సులో సీఎం వైజాగ్‌కు చేరుకోగా ఆయనకు హోంమంత్రి అనిత, పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

News November 13, 2025

నవంబర్ 13: చరిత్రలో ఈరోజు

image

1780: సిక్కు సామ్రాజ్య స్థాపకుడు రంజిత్ సింగ్ జననం
1920: గణిత శాస్త్రవేత్త కె.జి.రామనాథన్ జననం
1925: నటి, గాయకురాలు టంగుటూరి సూర్యకుమారి జననం
1935: సినీ గాయకురాలు పి.సుశీల జననం (ఫొటోలో లెఫ్ట్)
1973: స్వాతంత్ర్య సమరయోధురాలు బారు అలివేలమ్మ మరణం
2002: కవి కాళోజీ నారాయణరావు మరణం (ఫొటోలో రైట్)
2010: సినీ నిర్మాత డి.వి.యస్.రాజు మరణం