News September 11, 2024
అమరావతిలో ఫ్లాట్ల నిర్మాణానికి మరోసారి టెండర్లు

AP: సీఎం చంద్రబాబు ఆమోదంతో ‘హ్యాపీనెస్ట్’కు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ సిద్ధమైంది. రూ.930 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టనున్నారు. మొత్తం 12 టవర్లలో జీ+18 ఫార్మాట్లో 1,200 ఫ్లాట్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2018లోనే అమ్మకాలు పూర్తయినా వైసీపీ హయాంలో పనులు ఆగిపోయాయి. దీంతో మరోసారి టెండర్లు పిలవనుంది.
Similar News
News January 31, 2026
బోండా గొంతులో ఇరుక్కుని మృతి

TG: హైదరాబాద్లో ఓ వ్యక్తి టిఫిన్ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు. మధురానగర్ పీఎస్ పరిధిలోని రహ్మత్ నగర్లో గురువారం అర్ధరాత్రి లారీ డ్రైవర్ దాసరి రమేశ్ (45) ఓ టిఫిన్ సెంటర్ వద్ద బోండాలు కొన్నాడు. అక్కడే కూర్చొని తింటుండగా ఓ బోండా గొంతులో ఇరుక్కుంది. ఊపిరాడక తీవ్రంగా ఇబ్బందిపడ్డ ఆయన కాసేపటికే ప్రాణాలు వదిలాడు.
News January 31, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం తగినంత ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ కోసం ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.
News January 31, 2026
నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఉద్యోగాలు

<


