News March 2, 2025

ఉర్దూ స్కూళ్లకు ఒంటిపూట బడులు

image

TG: రంజాన్ సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లు, ఉర్దూ డైట్ కాలేజీల్లో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. కాగా నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి.

Similar News

News October 29, 2025

‘మొంథా’తో ఏపీకి తీవ్ర నష్టం: CBN

image

‘మొంథా’తో ఏపీకి తీవ్రనష్టం వాటిల్లిందని CM CBN తెలిపారు. తుఫాను తాకిన ప్రాంతంలో తీవ్ర గాలులు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలతో నష్టం వాటిల్లిందని వివరించారు. ‘ఈ పెనువిపత్తును ముందస్తు జాగ్రత్తలతో సమర్థంగా ఎదుర్కొన్నాం. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తినష్టం లేకుండా కాపాడుకోగలిగాం. 200 క్యాంపుల్లో 1.80 లక్షల మందికి ఆశ్రయమిచ్చాం. యంత్రాంగం సమష్టిగా పనిచేసి ప్రజలను కాపాడింది’ అని వెల్లడించారు.

News October 29, 2025

కురవని కృత్రిమ వర్షం.. క్లౌడ్ సీడింగ్ వాయిదా!

image

కృత్రిమ వర్షంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలివ్వలేదు. మేఘాల్లో తేమ తక్కువగా ఉండటంతో క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ సక్సెస్ కాలేదు. దీంతో ఈ రోజు నిర్వహించాల్సిన సీడింగ్‌ను వాయిదా వేశారు. మేఘాల్లో తేమ ఎక్కువగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి మంజీందర్ సిర్సా తెలిపారు. కాగా మొత్తంగా ₹3.2 కోట్ల ఖర్చుతో 5సార్లు ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.

News October 29, 2025

భారీ వర్షంతో తొలి టీ20 రద్దు

image

ఆస్ట్రేలియా-భారత్ మధ్య కాన్‌బెర్రాలో జరిగే తొలి టీ20 రద్దయింది. వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా దూకుడుగా ఆడింది. 9.4 ఓవర్లలో 97/1 రన్స్ చేసింది. అభిషేక్ 19 రన్స్ చేసి ఔటవ్వగా.. గిల్ 37*, సూర్య 39* దూకుడుగా ఆడారు.