News March 18, 2024
నేటి నుంచి ఒంటిపూట తరగతులు

నెల్లూరు జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నేటి నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని డీఈఓ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే నెల 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలన్నారు. రోజూ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 4, 2026
ఆనం కుమారుల సైలెంట్కు కారణం ఏంటి?

నెల్లూరు రాజకీయం అంటే ముందుగా గుర్తు వచ్చేది అనం కుటుంబం. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి రెండు దశాబ్దాల పాటు నెల్లూరులో తిరుగులేని వ్యక్తిగా నిలబడ్డారు. అయితే ఆయన మరణాంతరం కుమారులు ఆనం రంగ మయూర్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డిలు సైలెంట్గా ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తారని ఆనం కుటుంబం అభిమానులు చెబుతున్నారు. వీరి రాజకీయ ఎంట్రీ ఏ పార్టీల నుంచి అనే దానిపై చర్చ సాగుతోంది.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.


