News March 17, 2024
రేపటి నుంచి ఒంటి పూట బడులు: డీఈఓ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన తెలిపారు. ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30గటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
Similar News
News September 3, 2025
పాపవినాశనం ఇసుక రీచ్పై ఈ-టెండర్లు

జిల్లాలోని ఘంటసాల మండలం పాపవినాశనం ఇసుక రీచ్ నుంచి ఇసుక తవ్వకాలకు నిబంధనల మేరకు ఈ-టెండర్లు పిలవాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో జిల్లాలో ఇసుక నిల్వలపై సమీక్షించారు.
News September 2, 2025
కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ చల్లపల్లిలో చోరీలకు పాల్పడుతున్న దంపతులు అరెస్ట్
☞ స్వమిత్వ సర్వేతో భూ సమస్యల పరిష్కారం: కలెక్టర్
☞ NTR: 13 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
☞ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆలయంలో భక్తుల రద్దీ
☞ ఉంగుటూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు
☞ హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్
☞ హనుమాన్ జంక్షన్లో ఆటో డ్రైవర్ల ఆందోళన
News September 2, 2025
హరికృష్ణ జయంతి.. కొడాలి నాని ట్వీట్

హరికృష్ణ జయంతి సందర్భంగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. ‘నిరాడంబరత, నిజాయితీ కలగలసిన మంచి మనిషి, అనునిత్యం మా ఎదుగుదలను కాంక్షించిన నా గురువు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా స్మరించుకుంటూ’ అని రాసుకొచ్చారు. గతంలో ఆయనతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు.