News March 17, 2024
రేపటి నుంచి ఒంటి పూట బడులు: డీఈఓ

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తాన తెలిపారు. ఉదయం 7.45గంటల నుంచి మధ్యాహ్నం 12.30గటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు.
Similar News
News January 25, 2026
అవార్డు అందుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం విజయవాడ తుమ్మలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఓటర్ల జాబితా సవరణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. 2022 ఓటర్ల జాబితాను 2025 ఓటర్ల జాబితాలో అనుసంధానం చేసే ప్రత్యేక సవరణ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిభ కనబర్చారు.
News January 25, 2026
కృష్ణా: పద్మశ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి నేపథ్యం ఇదే..!

కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ వేదాంత పండితుడు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. వెంపటి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిస్తే.. 1950 ఆగస్ట్ 12న గుడ్లవల్లేరులో ఆయన జన్మించారు. అద్వైత-వేదాంత, దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలు అందించారు.
News January 25, 2026
కృష్ణా: డా. నోరి దత్తాత్రేయుడి నేపథ్యమిదే

వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణుడు డా. నోరి దత్తాత్రేయకు కేంద్రం పద్మ భూషన్ అవార్డు ప్రకటించింది. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన డా. నోరి 1947లో జన్మించారు. మచిలీపట్నంలో పాఠశాల విద్య, కర్నూలులో వైద్య విద్యనభ్యసించారు. ప్రపంచంలోనే క్యాన్సర్ వ్యాధి నిపుణుడిగా ఆయన పేరుగాంచారు. 2015లోనూ డా.నోరి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.


