News April 20, 2024
వారికి ఒకరోజు సెలవు ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు

AP: ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర జిల్లాల్లో పనిచేసే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మే మొదటి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఉద్యోగ సంఘాలు కోరాయి. సిబ్బందిని పోలింగ్ కేంద్రాల వద్దకు ముందురోజు మధ్యాహ్నం చేర్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. పోస్టల్ బ్యాలెట్ నమోదు, జారీ ప్రక్రియపై కొంత మంది అధికారుల్లో అనుమానాలను తొలగించాలని కోరాయి.
Similar News
News April 4, 2026
కరెంట్ అఫైర్స్

* లద్దాక్లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్
News April 4, 2026
కరెంట్ అఫైర్స్

* లద్దాక్లో ‘మిషన్ మిత్ర’ ప్రారంభించిన గగన్యాన్ వ్యోమగాములు
* భారతీయ నేవీ అమ్ములపొదిలోకి INS అరిధమాన్ న్యూక్లియర్ సబ్మెరైన్
* 250.5 గిగావాట్ల సామర్థ్యంతో పునరుత్పాదక శక్తిలో ప్రపంచంలో భారత్కు మూడోస్థానం
* మంగోలియా కొత్త ప్రధానిగా ఉచ్రల్ నయామ్
* మయన్మార్ అధ్యక్షుడిగా మిలిటరీ చీఫ్ మిన్ ఔంగ్ హ్లేయింగ్
News April 4, 2026
డిఫెన్స్ బడ్జెట్ను 40% పెంచిన అమెరికా!

అమెరికా తన డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంచింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల (₹139లక్షల కోట్లు) బడ్జెట్కు ఆమోదం తెలపాలని అమెరికా అధ్యక్షుడు US కాంగ్రెస్లో ప్రతిపాదించారు. ఇరాన్తో యుద్ధం సహా గ్లోబల్గా అమెరికా మిలిటరీ అవసరాలు పెరగడంతో ఆ భారం డిఫెన్స్ బడ్జెట్పై పడింది. దీనిని ఆమోదిస్తే బడ్జెట్ 40% పెరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి హైక్ ఇదే తొలిసారి.


