News February 28, 2025
మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

AP: ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వారం రోజుల నుంచి రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మార్చి మొదటి వారం నుంచే ఒంటిపూట బడుల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Similar News
News December 1, 2025
TG ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TG: శిఖా గోయల్, CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర తదితర IPS ఆఫీసర్లను IAS క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని హైకోర్టు CSకు నోటీసులిచ్చింది. GO 1342 ద్వారా ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడం చట్టవిరుద్ధమని శ్రీకాంత్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ సూరేపల్లి నంద DEC10 లోపు సమాధానం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేశారు.
News December 1, 2025
డేటింగ్ వార్తలపై మృణాల్ క్లారిటీ

హీరో ధనుష్తో మృణాల్ ఠాకూర్ <<18371019>>డేటింగ్<<>> వార్తలు కొన్ని నెలలుగా వస్తున్నాయి. తాజాగా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు SMలో ప్రచారం జరుగుతోంది. వీటిపై మృణాల్ పరోక్షంగా స్పందించారు. ‘ఇలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. రూమర్ల వల్ల ఉచితంగా నాకు PR జరుగుతోంది. ఇలాంటి ఫ్రీ స్టఫ్ నాకు ఇష్టం’ అని చెప్పారు. తాము మిత్రులమంటూ ధనుష్తో డేటింగ్ వార్తలను గతంలో ఆమె కొట్టిపారేశారు.
News December 1, 2025
త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ: మంత్రి దుర్గేశ్

సినిమా షూటింగ్లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా APని నిలుపుతామని మంత్రి దుర్గేశ్ అన్నారు. ‘త్వరలో కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరిస్తాం. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే ప్రోత్సాహం కల్పిస్తాం. కలిసి పనిచేసి తెలుగు సినీ పరిశ్రమలో నూతన అధ్యాయం సృష్టిద్దాం. నంది అవార్డుల ప్రదానోత్సవం, నాటకోత్సవాలను త్వరలోనే నిర్వహిస్తాం’ అని ముంబైలో ‘CII బిగ్ పిక్చర్ సమ్మిట్’లో వెల్లడించారు.


