News March 18, 2024

ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

image

AP: ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు క్లాసులు జరుగుతాయి. నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగుతాయి. అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో ఏడు రోజుల పాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.

Similar News

News November 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 55 సమాధానాలు

image

1. అయోధ్య నగరాన్ని ‘మను చక్రవర్తి’ నిర్మించారు.
2. విచిత్రవీర్యుని తండ్రి ‘శంతనుడు’.
3. కృష్ణుడు గోవర్ధన గిరిని ‘ఏడు’ రోజులు ఎత్తి పట్టుకున్నాడు.
4. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలను ‘చక్రాలు’ అని అంటారు.
5. జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడాన్ని‘మోక్షం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 3, 2025

APPLY NOW: CCIలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) 14 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, పీజీ(ఎకనామిక్స్), బీటెక్, బీఈ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. నెలకు రూ.60వేలు జీతం చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://cci.gov.in

News November 3, 2025

WWC: ప్లేయర్లకు డైమండ్​ నెక్లెస్​ల బహుమతి!

image

మహిళల వన్డే ప్రపంచ కప్​ విజేతగా నిలిచిన భారత ప్లేయర్లకు సూరత్(గుజరాత్) వ్యాపారవేత్త, MP గోవింద్​ ఢోలకియా స్పెషల్​ గిఫ్టులను ప్రకటించారు. భారతీయులు గర్వపడేలా అమ్మాయిలు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని, వారికి వజ్రాల ఆభరణాలు, ఇళ్లకు అమర్చేందుకు సోలార్​ ప్యానెళ్లను గిఫ్ట్​గా ఇస్తున్నట్టు తెలిపారు. ఈ విజయం మన దేశానికి కొత్తవెలుగులు తెచ్చిందని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.