News December 29, 2024

ఓటర్లు ల‌క్ష మంది.. ఓటేసింది 2 వేల మందే

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డంలో చూపిన ఆస‌క్తిని, ఓటు వేయ‌డంలో చూప‌లేదు విదేశాల్లో ఉన్న భార‌తీయులు. గ‌త ఎన్నిక‌ల కోసం 1.20 ల‌క్ష‌ల మంది ఓవ‌ర్‌సీస్ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవ‌లం 2,958 మంది మాత్ర‌మే ఓటు వేయ‌డానికి పోలింగ్ రోజు స్వ‌దేశానికి రావ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ నుంచి అత్య‌ధికంగా 89 వేల మంది ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.

Similar News

News October 20, 2025

BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 20, 2025

కూతుళ్లు అలా చేస్తే కాళ్లు విరగ్గొట్టాలి: ప్రజ్ఞా ఠాకూర్‌

image

భోపాల్(MP) మాజీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘హిందూయేతర పురుషుడి వద్దకు మనమ్మాయి వెళ్తానంటే కాళ్లు విరగ్గొట్టాలి. మన విలువలు పాటించని వారికి క్రమశిక్షణ నేర్పాలి. పిల్లల భవిష్యత్ కోసం కొట్టినా ఫరవాలేదు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి వచ్చిందని సంతోషపడతాం. కానీ పెద్దయ్యాక ఇతర మతస్థుడి ఇంటికి భార్యగా వెళ్తుంది. అలా జరగకుండా చూడాలి’ అని ఓ రిలీజియస్ ఈవెంట్లో సూచించారు.

News October 20, 2025

వంటింటి చిట్కాలు

image

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.