News December 29, 2024

ఓటర్లు ల‌క్ష మంది.. ఓటేసింది 2 వేల మందే

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఓట‌రుగా న‌మోదు చేసుకోవ‌డంలో చూపిన ఆస‌క్తిని, ఓటు వేయ‌డంలో చూప‌లేదు విదేశాల్లో ఉన్న భార‌తీయులు. గ‌త ఎన్నిక‌ల కోసం 1.20 ల‌క్ష‌ల మంది ఓవ‌ర్‌సీస్ ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నారు. అయితే వీరిలో కేవ‌లం 2,958 మంది మాత్ర‌మే ఓటు వేయ‌డానికి పోలింగ్ రోజు స్వ‌దేశానికి రావ‌డం గ‌మ‌నార్హం. కేర‌ళ నుంచి అత్య‌ధికంగా 89 వేల మంది ఓట‌ర్లుగా న‌మోదు చేసుకున్నట్టు ఈసీ గణాంకాలు వెల్లడించాయి.

Similar News

News November 17, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.

News November 17, 2025

పెరిగిన బంగారం ధరలు

image

ఇవాళ ఉదయం స్వల్పంగా <<18308959>>తగ్గిన<<>> బంగారం ధరలు సాయంత్రం పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.320 పెరిగి రూ.1,25,400కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి ధర రూ.300 ఎగిసి రూ.1,14,950గా నమోదైంది. వెండి ధరలో సాయంత్రం ఎలాంటి మార్పు జరగలేదు. కేజీ రూ.1,73,000గా ఉంది.

News November 17, 2025

భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు ప్రత్యేక రైళ్లు

image

AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ నుంచి కొల్లంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వేస్ ప్రకటించింది. రేపట్నుంచి జనవరి 21 వరకు ఈ రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్స్ ప్రతి మంగళవారం విశాఖ-కొల్లం(08539), ప్రతి బుధవారం కొల్లం-విశాఖ(08540) మధ్య స్లీపర్, 2AC, 3AC బోగీలతో నడవనున్నాయి. ఇవి రాజమండ్రి, VJA, నెల్లూరు, రేణిగుంట మీదుగా వెళ్తాయి. ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కూడా అందుబాటులో ఉంది.