News April 30, 2024
హర్షిత్ రాణాపై ఒక మ్యాచ్ నిషేధం

KKR బౌలర్ హర్షిత్ రాణాకు ఐపీఎల్ యాజమాన్యం షాకిచ్చింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా విధించడంతోపాటు ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధించింది. గతంలో SRH ప్లేయర్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన తర్వాత ఫ్లయింగ్ కిస్లు ఇస్తూ రెచ్చగొట్టడంతో అతని మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. నిన్న DCతో మ్యాచ్లోనూ అనుచితంగా ప్రవర్తించడంతో కఠిన నిర్ణయం తీసుకుంది.
Similar News
News April 7, 2026
వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంత సేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇవాళ KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ ఆగే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 స్కోర్ చేసింది. ఇక 2025 ఏప్రిల్ 26న కూడా ఇదే వేదికలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయ్యింది.
News April 7, 2026
రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్

పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికీ లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు.
News April 7, 2026
రాజధానిగా అమరావతి.. ముఖ్యమైన తేదీలివే!

➤ మార్చి 28, 2026: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.
➤ ఏప్రిల్ 1: లోక్సభలో అమరావతి బిల్లుపై 2గంటలకు పైగా చర్చ.. ఆపై ఆమోదం
➤ ఏప్రిల్ 2: రాజ్యసభలో గంటకు పైగా చర్చ.. అనంతరం బిల్లుకు ఆమోదం
➤ ఏప్రిల్ 6: రాజ్యసభ నుంచి రాష్ట్రపతి భవన్కు బిల్లు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేయడంతో అమరావతికి చట్టబద్ధత. గెజిట్ నోటిఫికేషన్ విడుదల


