News July 22, 2024
ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరు ఉద్యోగానికి సెట్టవ్వరు!

యువతలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరికే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు తగిన ప్రతిభ ఉంటోందని పేర్కొంది. అయితే ఒకప్పటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైంది. గత దశాబ్దంలో 66% మందికి తగిన స్కిల్స్ ఉండేవి కావు. ఇప్పుడది 49 శాతానికి పడిపోవడం గమనార్హం. ఏఐ వంటి టెక్నాలజీలు సవాళ్లు విసురుతున్న తరుణంలో యువత నైపుణ్యాలు అందిపుచ్చుకోవడం అత్యావశ్యకం.
Similar News
News January 25, 2026
APPLY: టెన్త్ అర్హతతో 572 పోస్టులు

RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఫిబ్రవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్లో 36 పోస్టులున్నాయి. టెన్త్ పాసైన వారు అర్హులు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. ఆన్లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్సైట్: rbi.org.in
News January 25, 2026
ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి: CS

AP: ప్రజాస్వామ్య పటిష్ఠతకు ఓటు హక్కు వినియోగమే పునాది అని సీఎస్ విజయానంద్ చెప్పారు. విజయవాడలో ఏర్పాటు చేసిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘18 ఏళ్లు నిండిన వారు JAN 1, APR 1, JULY 1, OCT 1న ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. Form-8 ద్వారా చిరునామాను మార్చుకోవచ్చు. EPIC కార్డ్ ఉండటం వల్ల ఓటు హక్కు రాదు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో <
News January 25, 2026
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్న భారత్.. కానీ

ఇటీవల జపాన్ను దాటి నాలుగో స్థానానికి చేరిన భారత్, 2028లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుంది. అయినా తలసరి ఆదాయం తక్కువగానే ఉంది. దీనికి కారణం 140 కోట్ల మందిపై GDP పంచుకోవాల్సి రావడం. అదే విధంగా దాదాపు 46% మంది వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నా వారి ఆదాయం తక్కువగా ఉంది. 80% పైగా ఉద్యోగాలు సరైన గుర్తింపు లేనివి కాగా కేవలం IT, ఫినాన్స్ వంటి రంగాల్లోనే సంపద కేంద్రీకరణ అయి ఉంది.


