News March 18, 2024
ఒకసారే గ్రూప్-1 మూల్యాంకనం: APPSC
AP: గ్రూప్-1(2018) మెయిన్స్ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనం ఒకసారి మాత్రమే జరిగిందని APPSC ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ‘ఈ పరీక్షలను హైకోర్టు రద్దు చేయడంపై అప్పీల్కు వెళ్తాం. కమిషన్పై వచ్చిన ఆరోపణలకు సరైన సమయంలో, సరైన వివరణ ఇస్తాం. పరీక్షలు, నియామకాలు పారదర్శకంగా జరిగాయి. CCTV నిఘాలో జరిగిన మూల్యాంకనం ఆధారాలు మా వద్ద ఉన్నాయి. ఈ విషయంలో మాపై మచ్చ పడిందని అనుకోవడం లేదు’ అని స్పష్టం చేశారు.
Similar News
News September 30, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
AP: ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులందరికీ OCT 14లోగా APAAR(ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) కార్డులు ఇవ్వాలని విద్యాశాఖ ఆదేశించింది. దీనిపై తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించాలని సూచించింది. ఈ కార్డులో విద్యార్థి పేరు, బర్త్డే, ఫొటో, క్యూఆర్ కోడ్, 12 అంకెలతో గుర్తింపు నంబర్ ఉంటుంది. పిల్లల అకడమిక్ సమాచారం, ప్రోగ్రెస్ వివరాలన్నీ ఇందులో నిక్షిప్తమవుతాయి.
News September 30, 2024
నూతన లిక్కర్ పాలసీపై నేడో రేపో నోటిఫికేషన్
AP: మద్యం వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించేందుకు వీలుగా ‘AP రెగ్యులరేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్’ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ ఆర్డినెన్స్ను గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదించారు. న్యాయశాఖ ఇవాళ ఉదయం గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించనుంది. నూతన మద్యం పాలసీ విధివిధానాలతో నేడు సాయంత్రం లేదా రేపు ఉదయం ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులివ్వనుంది. OCT 10-11 నాటికి లైసెన్సుల ప్రక్రియ పూర్తవనుంది.
News September 30, 2024
పాకిస్థాన్ అలా చేసి ఉంటే..: రాజ్నాథ్ సింగ్
J&K ఎన్నికల ప్రచారంలో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ గాని భారత్తో సత్సంబంధాలు కొనసాగించి ఉంటే IMFని కోరుతున్న మొత్తం కంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి ఉండేవారమని తెలిపారు. భారత్కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని అస్త్రంగా చేసుకున్న పాకిస్థాన్ అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారిందని విమర్శించారు.