News October 9, 2024
ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News December 7, 2025
రేషన్లో మళ్లీ రాగులు, జొన్నలు

AP: రేషన్లో బియ్యం, చక్కెరతోపాటు రాగులు, జొన్నలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ నుంచే పంపిణీ చేస్తుండగా, ఈ నెల నుంచి ఉత్తర కోస్తాలో ప్రారంభించింది. పలు జిల్లాల్లో రాగులు, ఇంకొన్ని చోట్ల జొన్నలు అందజేస్తోంది. 20 KGs రేషన్ తీసుకునే కుటుంబానికి గరిష్ఠంగా 3KGs వరకు రాగులు, జొన్నలు, 17 KGs బియ్యం ఇస్తోంది. కాగా TDP ప్రభుత్వం గతంలోనూ రాగులు, రాగిపిండిని పంపిణీ చేసింది.
News December 7, 2025
శని దోష నివారణకు పాటించాల్సిన పరిహారాలు

శని దోషం ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. అందుకే కొన్ని పరిహారాలు తప్పక పాటించాలని పండితులు సూచిస్తారు. ‘ప్రతి శనివారం నువ్వుల నూనెతో శని దేవుడికి దీపం పెట్టాలి. పక్షులకు ఆహారం, నల్ల చీమలకు చక్కెర పెట్టాలి. పెరుగన్నం దానం చేయాలి. సోమవారం శివాలయాలను దర్శించాలి. పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. మంగళవారం హనుమాన్ చాలీసా పఠిస్తే ఫలితాలుంటాయి. దశరథ శని స్తోత్రంతో శని దోషం సన్నగిల్లుతుంది’ అంటున్నారు.
News December 7, 2025
ఆ మాట అనకుండా ఉండాల్సింది: SA కోచ్

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత ఆ టీమ్ హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ వాడిన గ్రోవెల్(సాష్టాంగం పడటం) పదంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. వన్డే సిరీస్లో ఓటమి తర్వాత ఆ కాంట్రవర్సీపై ఆయన స్పందించారు. ‘తప్పుడు ఉద్దేశంతో ఆ మాట అనలేదు. ఇంకా బెటర్ వర్డ్ ఎంచుకుని ఉండాల్సింది. భారత్ మైదానంలో ఎక్కువసేపు గడిపి ఉండాల్సింది అన్న ఉద్దేశంలో అలా అన్నాను. వినయమే SA టెస్టు టీమ్ పునాది’ అని తెలిపారు.


