News October 9, 2024
ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.
Similar News
News December 11, 2025
విత్తన బిల్లును వెనక్కు తీసుకోవాలి: KTR

TG: కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేసే విధంగా ఉన్న విత్తన బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని BRS నేత KTR డిమాండ్ చేశారు. ‘ఎలాంటి ట్రయల్స్ లేకుండా విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉంది. రైతులకు పరిహారం గ్యారంటీ లేదు. నకిలీ విత్తనాలకు కంపెనీలను కాకుండా అమ్మకందారులను బాధ్యుల్ని చేసేలా బిల్లు ఉంది. రాష్ట్ర అగ్రి శాఖల్లోని కీలక విత్తనాలు కేంద్ర ఆధిపత్యంలోకి వెళ్తాయి’ అని పేర్కొన్నారు.
News December 11, 2025
అర్ష్దీప్ చెత్త బౌలింగ్.. ఒకే ఓవర్లో 7 వైడ్లు

సౌతాఫ్రికాపై టీమ్ ఇండియా పేసర్ అర్ష్దీప్ చెత్త బౌలింగ్ చేశారు. ఒకే ఓవర్లో ఏకంగా 7 వైడ్లు వేశారు. తొలి బంతికే డికాక్ సిక్స్ కొట్టగా.. అనంతరం 7 బంతుల్లో 6 వైడ్లు వేశారు. తర్వాత 1, 2, 1 రన్స్ ఇచ్చారు. ఆపై మళ్లీ 7వ వైడ్ వేశారు. ఆఖరి బంతికి డికాక్ సింగిల్ తీశారు. ఈ ఓవర్లో ఎక్స్ట్రాలతో కలిపి మొత్తం 18 రన్స్ వచ్చాయి. అర్ష్దీప్ బౌలింగ్కు హెడ్ కోచ్ గంభీర్ కూడా తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపించారు.
News December 11, 2025
ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ‘ప్రెసిడెంట్ ట్రంప్తో ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఆశా జనకంగా చర్చలు సాగాయి. రీజినల్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్పై కూడా చర్చించాం. గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, శ్రేయస్సు కోసం ఇండియా, అమెరికా కలిసి పనిచేయడం కొనసాగిస్తాయి’ అని ప్రధాని ట్వీట్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన తర్వాత జరిగిన ఈ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


