News April 16, 2025
భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది అవకాశం

TG: రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన ‘భూభారతి’ భూరికార్డుల్లో తప్పుల సవరణకు ఏడాది వరకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కలెక్టర్లు, ఆర్డీవోలకు సవరణ అధికారులు ఇవ్వనుంది.
ఫీజుల వివరాలు..
మ్యుటేషన్/సక్సెషన్: ఎకరానికి రూ.2,500
పట్టాదార్ పాస్ బుక్: రూ.300, సర్టిఫైడ్ కాపీ: రూ.10
రికార్డ్ సవరణ/ అప్పీళ్లు: రూ.1,000
స్లాట్ రీషెడ్యూల్: తొలిసారి ఫ్రీ, రెండోసారి రూ.500
Similar News
News December 18, 2025
NLG: ముగిసిన పల్లె సంగ్రామం

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
News December 18, 2025
హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.


