News September 16, 2024
కొనసాగుతున్న నందిగం సురేశ్ విచారణ.. 30 ప్రశ్నలు అడిగిన పోలీసులు!

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ను మంగళగిరి రూరల్ పీఎస్లో పోలీసులు విచారిస్తున్నారు. లాయర్ సమక్షంలో నిన్న, ఇవాళ దాదాపు 30 ప్రశ్నలు అడగగా, కొన్ని ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో భాగంగా నేడు ఉ.8 నుంచి ఉ.9:30 వరకు విచారణ జరిగింది. ఉ.10:30 తర్వాత ఆయనను పోలీసులు మళ్లీ విచారించనున్నారు.
Similar News
News December 17, 2025
‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.
News December 17, 2025
బర్త్డే విషెస్.. CBN, పవన్కు షర్మిల థాంక్స్

AP: పీసీసీ చీఫ్ షర్మిలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ Xలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. షర్మిల ఆరోగ్యంగా, దీర్ఘాయుష్షుతో ఉండాలని వారు ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు చెబుతూ పీసీసీ చీఫ్ రిప్లై ఇచ్చారు. అటు వైసీపీ చీఫ్ జగన్ షర్మిలకు విషెస్ చెప్పకపోవడం గమనార్హం.
News December 17, 2025
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు విధించడానికి రైల్వే సిద్ధమైంది. స్లీపర్, ఏసీ 3 టైర్లో ప్రయాణికులు 40Kgలు, 2nd AC ప్యాసింజర్లు 50Kgలు, 1st క్లాస్ ప్రయాణికులకు 70Kgల వరకు తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. జనరల్ బోగీలో ప్రయాణించే వాళ్లు 35Kgల లగేజీ తీసుకెళ్లవచ్చు. 5-12 ఏళ్ల పిల్లలకు ఆ పరిమితిలో 50% లేదా గరిష్ఠంగా 50Kgల వరకు అనుమతి ఉంటుంది. పరిమితి మించితే అదనపు ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది.


