News September 16, 2024

కొనసాగుతున్న నందిగం సురేశ్ విచారణ.. 30 ప్రశ్నలు అడిగిన పోలీసులు!

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను మంగళగిరి రూరల్ పీఎస్‌లో పోలీసులు విచారిస్తున్నారు. లాయర్ సమక్షంలో నిన్న, ఇవాళ దాదాపు 30 ప్రశ్నలు అడగగా, కొన్ని ప్రశ్నలకు ఆయన తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. రెండో రోజు కస్టడీలో భాగంగా నేడు ఉ.8 నుంచి ఉ.9:30 వరకు విచారణ జరిగింది. ఉ.10:30 తర్వాత ఆయనను పోలీసులు మళ్లీ విచారించనున్నారు.

Similar News

News December 7, 2025

గొర్రె పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

image

గొర్రె పిల్లలకు పుట్టిన మొదటి రోజు నుంచి 20 వారాల వయసు వచ్చేవరకు వివిధ దశలలో సరిపడేంతగా పాలను, క్రీపు దాణాను, T.M.R(టోటల్‌ మిక్స్‌డ్‌ రేషన్‌)ను నిర్దేశిత పరిమాణంలో అందించాలి. వీటిని సరైన పరిమాణంలో అందిస్తే 5 లేదా 6 నెలల వయసులోనే గొర్రె పిల్లలు 28 నుంచి 30 కిలోల బరువు పెరుగుతాయి. దీని వల్ల త్వరగా వీటిని కోతకు అమ్మి మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే వాటి మరణాల శాతాన్ని కూడా గణనీయంగా తగ్గించవచ్చు.

News December 7, 2025

ఏడుకొండల వాడికి పుష్ప కైంకర్యం చేసిన భక్తుడు

image

శ్రీవారికి పుష్ప కైంకర్యం చేసిన గొప్ప భక్తుడు అనంతాళ్వార్. ఈయన రామానుజాచార్యుల శిష్యుడు. గురువు ఆదేశం మేరకు తిరుమలలో స్వామివారి సేవకు పూల తోటను పెంచారు. ఓసారి స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చి ఆయనను పరీక్షించగా కోపంతో గునపం విసిరారు. అది తగిలి స్వామివారి చుబుకానికి గాయమైంది. అందుకే శ్రీవారి గడ్డంపై కర్పూరపు చుక్క పెట్టడం ఇప్పటికీ ఆనవాయితీగా ఉంది. ఆ గునపాన్ని తిరుమలతో చూడవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 7, 2025

స్మృతితో పెళ్లి రద్దు.. పలాశ్ ఏమన్నారంటే?

image

స్మృతి మంధానతో పెళ్లి రద్దుపై పలాశ్ ముచ్చల్‌ SMలో పోస్ట్ పెట్టారు. ‘పర్సనల్ రిలేషన్‌షిప్ నుంచి తప్పుకుంటున్నా. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా. నాపై వచ్చిన నిరాధారమైన వదంతులు బాధించాయి. గాసిప్‌ల ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దనే విషయాన్ని సమాజం నేర్చుకోవాలి. నాపై తప్పుడు కంటెంట్‌ను వ్యాప్తి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నాకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.