News April 1, 2025

కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.

Similar News

News November 28, 2025

కరీంనగర్: 2019 సం.లో 108.. మరి ఇప్పుడు..?

image

2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో KNRలో 15, PDPలో 13, JGTLలో 37, SRSLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకుల ఆశలపై అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీళ్లు చల్లింది.

News November 28, 2025

కరీంనగర్: 2019 సం.లో 108.. మరి ఇప్పుడు..?

image

2019 స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 1210 గ్రామ పంచాయతీలు ఉండగా, మొత్తం 108 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో KNRలో 15, PDPలో 13, JGTLలో 37, SRSLలో 43 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అయితే, ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10 లక్షల నిధులు కేటాయిస్తామనటంతో, ఈ నిధులతో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకున్న నాయకుల ఆశలపై అప్పటి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీళ్లు చల్లింది.

News November 28, 2025

కామారెడ్డి: జాగృతి చీఫ్ కవిత నేటి షెడ్యూల్

image

KMR జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. హోటల్ అమృత గ్రాండ్‌లో ఉదయం 10 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం అక్కడే 11 గంటలకు విద్యావంతులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తారు. 12 గంటలకు కామారెడ్డి పట్టణ వరద భాదిత కాలనీ సందర్శిస్తారు. 2:30 గంటలకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. 4:30 గంటలకు భిక్కనూర్ సిద్ధి రామేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు.