News April 1, 2025

కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

image

AP: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ప్రభుత్వ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేస్తున్నారు. ఉదయం 8.40 గంటల వరకు 53.98 శాతం మేర, 34 లక్షల మందికి పైగా నగదు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు, ఇవాళ ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లాలో పర్యటించనుండగా, లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ నగదు అందజేయనున్నారు.

Similar News

News October 20, 2025

రాష్ట్రంలో 97 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్‌లో వివిధ విభాగాల్లో 97 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. వైద్య విద్య ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల సమాచారం కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News October 20, 2025

గాల్లో విమాన అద్దం ధ్వంసం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

డెన్వర్(US) నుంచి లాస్‌ఏంజెలిస్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఘోర ప్రమాదం తప్పించుకుంది. గాల్లో 36 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో కాక్‌పిట్ విండ్‌షీల్డ్(అద్దం) పగిలిపోయి పైలట్‌కు గాయాలయ్యాయి. ఆయన వెంటనే అప్రమత్తమై ల్యాండ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. పైలట్ చేతిపై కాలిన గాయాలు ఉండటంతో ఉల్క ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

News October 20, 2025

ESIC ఇండోర్‌లో 124 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ESIC ఇండోర్‌లో 124 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. వెబ్‌సైట్: https://esic.gov.in/recruitments