News June 5, 2024

పల్నాడులో కొనసాగుతున్న పోలీస్ బందోబస్తు

image

AP: పోలింగ్ సమయంలో హింస చెలరేగిన పల్నాడు జిల్లాలో పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. ఫలితాల తర్వాత హింస చెలరేగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో బందోబస్తు కొనసాగిస్తున్నారు. నరసరావుపేటలో 144 సెక్షన్ అమలులో ఉంది. పోలీసులు ముందస్తుగా షాపులను మూయిస్తున్నారు. రాజకీయ నేతల ఇంటి దగ్గర ముళ్ల కంచెలు వేసి పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News November 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 24, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 24, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.10 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.26 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.03 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 24, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

image

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్‌ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.