News December 5, 2024

కొనసాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్ పోలింగ్

image

AP: ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బైఎలక్షన్ పోలింగ్ కొనసాగుతోంది. యూటీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ ఎన్నిక జరుగుతోంది. 116 పోలింగ్ కేంద్రాల్లో 16,737 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సా.4 వరకు పోలింగ్‌కు అవకాశం ఉంది. ఐదుగురు అభ్యర్థులు నారాయణరావు, దీపక్ పులుగు, నాగేశ్వరరావు, వెంకటలక్ష్మి, బొర్రా గోపీమూర్తి పోటీలో ఉన్నారు.

Similar News

News January 12, 2026

ప్రభుత్వ సేవలన్నీ మనమిత్ర ద్వారానే అమలవ్వాలి: కాటమనేని

image

AP: అంతరాయం లేకుండా ప్రభుత్వ సేవలు అందించేందుకు అన్ని శాఖలు మనమిత్ర యాప్ ద్వారా వాటిని అమలు చేయాలని IT కార్యదర్శి కాటమనేని భాస్కర్ పేర్కొన్నారు. ‘కొన్ని శాఖలు ఇప్పటికీ మాన్యువల్‌గా సేవలు కొనసాగిస్తున్నాయి. డేటా అనుసంధానం ప్ర‌క్రియ పూర్తి చేసి యూజ్ కేసెస్ సిద్ధం చేస్తున్నాం. AI ఆధారితంగా ఉప‌యోగ‌ప‌డే 98 కేసెస్‌ను ఇప్ప‌టికే సిద్ధం చేశాం. APR నాటికి పూర్తిగా వాటిని అందుబాటులోకి తెస్తాం’ అని తెలిపారు.

News January 12, 2026

కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

image

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.

News January 12, 2026

పండగకు ఏ చీర కొంటున్నారు?

image

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్‌ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..