News March 8, 2025

రచ్చ గెలిచి ఇంట ఓడిపోతున్న ఒంగోలు గిత్త!

image

భారత్‌కు గర్వకారణమైన ఒంగోలు గిత్త రచ్చ గెలిచి ఇంట ఓడిపోతోంది. తక్కువ తినడం, రోగాలు, అధిక వేడిని తట్టుకొనే సత్తువ వీటి సొంతం. అందుకే బ్రెజిల్లో ఒంగోలు గిత్త Viatina-19 బ్రీడు మొన్న ఏకంగా రూ.40లక్షల ధర పలికింది. ఇక్కడ రూ.లక్షకే లభించే వీటిని రైతన్నలు నిర్లక్ష్యం చేస్తున్నారు. అధిక పాల దిగుబడి కోసం సంకర జాతికే ఓటేస్తున్నారు. దాంతో 1944లో 15లక్షలున్న గిత్తలు 2019లో 6.34లక్షలకు తగ్గాయి. మీ కామెంట్.

Similar News

News December 25, 2025

ఐదు భాషల్లో ‘ధురంధర్-2’ విడుదల

image

ఆదిత్య ధర్, రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ధురంధర్ కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ మూవీకి పార్ట్-2 రానున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 19న రానున్న ‘ధురంధర్-2’ను హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ పేర్కొంది. కాగా ధురంధర్ 20 రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.640.20 కోట్ల నెట్ కలెక్ట్ చేసిందని తెలిపింది.

News December 25, 2025

ఫ్రెషర్లకు రూ.21 లక్షల జీతం.. ఇన్ఫోసిస్ డ్రైవ్!

image

దేశంలో మేజర్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫ్రెషర్ల కోసం ఆఫ్-క్యాంపస్ నియామక డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి రూ.7-21 లక్షల వరకు ప్యాకేజీ ఉండే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తెలిపింది. స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ (లెవెల్ 1-3), డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజినీర్ (ట్రైనీ) పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, EEEలో BE, BTech, ME, MTech, MCA చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు ఉండనున్నట్లు వివరించింది.

News December 25, 2025

21 లక్షల Sft విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం

image

AP: అమరావతిలో 7 భవనాలను ఐకానిక్ నిర్మాణాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ‘21 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మిస్తున్నాం. 8వ అంతస్తులో CJ కోర్టు, 2, 4, 6 అంతస్తుల్లో కోర్టు హాళ్లుంటాయి. 2027 నాటికి పనులు పూర్తవుతాయి’ అని వివరించారు. గత ప్రభుత్వం వల్ల పనులు ఆలస్యమయ్యాయని విమర్శించారు. హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ పనులను ఆయన ఇవాళ ప్రారంభించారు.