News September 2, 2025
వరిలో ఉల్లికోడు తెగులు – లక్షణాలు

వరిలో ఉల్లికోడు ఆశించే అవకాశం వర్షాకాలంలో ఎక్కువ. ఇది నారుమడి దశ నుంచి పిలకదశ వరకు ఆశించి నష్టపరుస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్క అంకురం ఉల్లికాడ లాగ గట్టిగా పొడవాటి గొట్టంలా మారుతుంది. ఇలా ఆశించిన పిలకలు కంకులు వేయవు. మొక్క ఎదగక ఆకులు ముడుచుకొని ఉండి వడలిపోతుంది. దీంతో దిగుబడి తగ్గుతుంది. పిలకదశలో ఒక దుబ్బుకు ఒక ఉల్లికోడు సోకిన ఉల్లిగొట్టం కనిపిస్తే నష్టం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Similar News
News September 22, 2025
‘ఇది నా మరణ వాంగ్మూలం’.. మాజీ డీఎస్పీ పోస్ట్

TG: మాజీ డీఎస్పీ నళిని తన ‘మరణ వాంగ్మూలం’ అంటూ FBలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. తన ఆరోగ్య పరిస్థితి కొంత కాలంగా ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ‘నా జీవితం ముగియబోతోంది. సాయం చేయాలని CMకు ఇచ్చిన అర్జీ బుట్టదాఖలైంది. కేంద్రం సాయం చేస్తే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాను. నేను స్థాపించిన వేదామృతం ట్రస్టుకు నా మరణానంతరం మోదీ సాయం చేయాలి. నా మరణాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవద్దు’ అని పేర్కొన్నారు.
News September 22, 2025
నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం

సీనియర్ నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి గీతా రాధ(86) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలో తుదిశ్వాస విడిచినట్లు రాధిక తెలిపారు. చివరి చూపుల కోసం ఆమె భౌతికకాయాన్ని పోయెస్ గార్డెన్లో ఉంచారు. రేపు (సెప్టెంబర్ 22) చెన్నైలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో ఆమెకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
News September 22, 2025
రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్న సీఎం!

TG: సింగరేణి ఉద్యోగులకు CM రేవంత్ రేపు ‘దసరా బోనస్’ ప్రకటించనున్నట్లు సమాచారం. శాశ్వత ఉద్యోగులకు రూ. 1.90 లక్షలు, తాత్కాలిక ఉద్యోగులకు రూ. 5వేల వరకు బోనస్ లభించే అవకాశం ఉంది. అలాగే సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం కొన్ని ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏటా బొగ్గు అమ్మకాలు, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా వచ్చే లాభాల నుంచి ఉద్యోగులకు బోనస్ ఇస్తోంది.