News October 13, 2025

పడిపోయిన ఉల్లి ధరలు.. కిలో రూ.5-రూ.10!

image

AP: ఉమ్మడి కడప(D) ఉల్లికి తాడేపల్లిగూడెం మార్కెట్లో గిట్టుబాటు ధర దక్కలేదని రైతులు వాపోయారు. కిలో రూ.5-రూ.10 వరకే కొనుగోలు చేశారని ఆవేదన చెందారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఉల్లికి కిలో రూ.12-రూ.18 వరకు ధర పలికింది. ఇటీవల ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రభుత్వం క్వింటా రూ.1,200కు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.

Similar News

News October 13, 2025

యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని: ట్రంప్

image

యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరి అని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘శాంతి కోసం కృషి చేసినందుకు నేనెప్పుడూ నోబెల్ బహుమతి కోరలేదు. ప్రజల ప్రాణాలను కాపాడటమే నా దౌత్యం లక్ష్యం. అంతేకానీ అవార్డుల కోసం కాదు. మిలియన్ల ప్రాణాలను కాపాడాను’ అని తెలిపారు. గాజా యుద్ధం కూడా ముగిసిందని, ఇది తాను పరిష్కరించిన 8వ వార్ అని పేర్కొన్నారు. అఫ్గాన్-పాక్ ఘర్షణల గురించి తెలిసిందని, దానిపైనా దృష్టి పెడతానన్నారు.

News October 13, 2025

భూమికి జనుము, అలసంద చేసే మేలు

image

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.

News October 13, 2025

నేడు విధుల్లోకి టూరిస్టు పోలీసులు

image

TG: రాష్ట్రంలోని టూరిస్ట్ పోలీస్ వ్యవస్థ అమల్లోకి రానుంది. శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది టూరిస్టు పోలీసులు నేడు విధుల్లో చేరనున్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై వీరికి శిక్షణ ఇచ్చారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలైన యాదాద్రి, భద్రాచలం, కీసరగుట్ట, సోమశిల తదితర ఆలయాలతో పాటు చార్మినార్, గోల్కొండ, అనంతగిరి హిల్స్ వంటి సందర్శక ప్రాంతాల్లో వీరు అందుబాటులో ఉంటారు.