News September 8, 2025

భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!

image

ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. TGలో కిలోకు రూ.5-16 మాత్రమే దక్కుతోంది. వినియోగదారులకు మాత్రం రూ.25-45 మధ్య లభిస్తోంది. ఫలితంగా మధ్యవర్తులే లాభపడుతున్నారు. APలో క్వింటా కనిష్ఠంగా రూ.501, గరిష్ఠంగా రూ.1,249 పలుకుతోంది. రైతుకు కేజీకి రూ.5-12 మధ్యే దక్కుతోంది. కొన్ని మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయి కొనుగోళ్లూ నిలిచిపోయాయి. ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Similar News

News September 8, 2025

మహాలయ పక్షాలు అంటే ఏంటి?

image

భాద్రపద మాసంలో కృష్ణ పక్ష పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షాలు అని అంటారు. అవి నేడు ప్రారంభమయ్యాయి. ఈ దినాలు పితృ దేవతలకు సంబంధించినవని, పితృ కార్యాలు చేయడానికి పవిత్రమైనవని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో కాలం చేసిన పెద్దలకు మనం విడిచే తర్పణాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. ఈ 15 రోజుల్లో ఈ కార్యాలు చేస్తే ఇంట్లో దేనికి లోటు ఉండదని ఎప్పటి నుంచో ఉన్న విశ్వాసం.

News September 8, 2025

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవ క్షేత్రాలు

image

శ్రీ కాళహస్తీశ్వర ఆలయం(తిరుపతి జిల్లా), శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం, మహానంది నందీశ్వర ఆలయం, యాగంటి ఉమా మహేశ్వర ఆలయం(నంద్యాల), ద్రాక్షారామం భీమేశ్వర స్వామి గుడి(కోనసీమ), అమరేశ్వర స్వామి ఆలయం (అమరావతి), పాలకొల్లు క్షీరారామ ఆలయం, భీమవరం సోమారామ ఆలయం(ప.గో), తాడిపత్రి రామలింగేశ్వరస్వామి (అనంతపురం), కుమారారామం కుమారభీమేశ్వర స్వామి ఆలయం(కాకినాడ), భైరవకోన దేవాలయం(ప్రకాశం).

News September 8, 2025

శివుడు రాక్షసులకు ఎందుకు వరాలు ఇచ్చాడంటే?

image

శివుడు ఆశుతోషుడు. త్వరగా సంతోషించిపోతాడు. ఆయనకు భక్తి, నిష్ఠ, కఠిన తపస్సు అంటే ఎంతో ఇష్టం. అందుకే.. ఎవరైనా నిస్వార్థ భక్తితో, తీవ్ర తపస్సుతో ఆరాధిస్తే వెంటనే కరిగిపోతాడు. వరం ఇస్తాడు. ఓ వ్యక్తి అకుంఠిత దీక్షకు ఆయన కట్టుబడి ఉంటాడు. రాక్షసులైనా కఠోర తపస్సు చేస్తే వారి శక్తిని గౌరవిస్తాడు. అందువల్లే రావణుడు వంటి రాక్షసులకు వరాలు ఇచ్చాడు. వీటిని ఎలా వాడుకోవాలన్నది మాత్రం వారి ఇష్టానికే వదిలేస్తాడు.