News December 30, 2024
రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు!

TG: రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్లైన్ అప్లికేషన్లు స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగుభూములకే సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్, ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయమై భట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

విజయవాడలోని కలెక్టరేట్లో సోమవారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వినతులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 24, 2025
రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్లో జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
News November 24, 2025
రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్లో జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.


