News April 4, 2024

మరో 2 రోజులే ఛాన్స్

image

TG: EAPCETకు భారీగా <>దరఖాస్తులు<<>> వస్తున్నాయి. FEB 26న అప్లికేషన్ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటివరకు 3,21,604 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్ కోసం 2,33,517, అగ్రికల్చర్/ఫార్మా విభాగాల్లో 87,819, మూడు విభాగాలకు 268 అప్లికేషన్లు వచ్చాయి. దరఖాస్తులకు ఇంకా 2 రోజుల గడువు ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గతేడాది మూడు విభాగాలకు కలిపి 3,20,683 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 25, 2025

పదేళ్లలో టెస్లా మూత పడొచ్చు: కార్లోస్ తవారెస్

image

ఆటోమొబైల్ రంగం నుంచి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తప్పుకోవచ్చని ఆటో జెయింట్ స్టెల్లాంటిస్ సంస్థ మాజీ CEO కార్లోస్ తవారెస్ అభిప్రాయపడ్డారు. ‘AI, స్పేస్ ఎక్స్, హ్యూమనాయిడ్ రోబోస్ మీద మళ్లీ ఫోకస్ చేసేందుకు మస్క్ టెస్లా నుంచి తప్పుకోవచ్చు. చైనాకు చెందిన BYD సంస్థ జోరు ముందు టెస్లా కంపెనీ ఓడిపోవచ్చు. పదేళ్ల తర్వాత ఎలాన్ మస్క్ కార్ల సంస్థ ఉంటుందని కూడా నేను చెప్పలేను’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

News October 25, 2025

తుఫాన్ ఎఫెక్ట్.. స్కూళ్లకు సెలవులు

image

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27,28,29 తేదీల్లో హాలిడే ఇచ్చారు. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27,28న సెలవు ప్రకటించారు. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. కాగా మరికొన్ని జిల్లాల్లోనూ హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది.

News October 25, 2025

ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి CBN శ్రీకారం

image

AP: ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీ సొసైటీ ద్వారా బీమా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ స్కీమ్‌ను CM CBN దుబాయ్‌లో ప్రారంభించారు. ‘ఉద్యోగులు, విద్యార్థులు, వలస కార్మికులకు ఇది ప్రయోజనం అందిస్తుంది. బీమా వ్యక్తి ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం పొందినా ₹10 లక్షలు అందుతుంది. ఈ పథకంలో నమోదు కావడానికి ‘https://apnrts.ap.gov.in/insurance’ వెబ్ సైట్‌ను సందర్శించాలి’ అని I&PR సూచించింది.